డీఏలో కోతపై పునరాలోచించాలి

డీఏలో కోతపై పునరాలోచించాలి

ప్రధానికి రైల్వే కార్మిక సంఘాల విజ్ఞప్తి


, హైదరాబాద్‌: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదార్లకు చెల్లించాల్సిన డీఏలో కోత విధించడంపై రైల్వే కార్మిక సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి.


ఈ విషయంలో పునరాలోచించాలని కోరుతూ ప్రధాని మోదీకి నేషనల్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ రైల్వేమన్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి మర్రి రాఘవయ్య లేఖ రాశారు.

‘‘భారతీయ రైల్వేలో 13 లక్షలపైచిలుకు ఉద్యోగుల్లో 90 శాతంపైగా క్షేత్రస్థాయిలో పనిచేసేవారే. ఒకరోజు వేతనాన్ని ఇప్పటికే పీఎం కేర్స్‌కు విరాళమిచ్చిన నేపథ్యంలోనూ డీఏలో కోత పెట్టడం షాక్‌కు గురిచేసింది’’

అని పేర్కొన్నారు. సంబంధిత నిర్ణయాన్ని మరోసారి సమీక్షించాలని సౌత్‌సెంట్రల్‌ రైల్వే మజ్దూర్‌ యూనియన్‌ ప్రధాన కార్యదర్శి శంకర్‌రావు సైతం కోరారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "డీఏలో కోతపై పునరాలోచించాలి"

Post a Comment