24 నుంచి ఇంటర్ మూల్యాంకనం
24 నుంచి ఇంటర్ మూల్యాంకనం
ఇంటర్ ప్రశ్నపత్రాల మూల్యాంకనాన్ని ఈ నెల 24 నుంచి ప్రారంభించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.
అదనంగా 26 కేంద్రాలు ఏర్పాటుచేస్తారు. కరోనా ప్రభావం అధికంగా ఉన్న జిల్లాల్లో మూల్యాంకన కేంద్రాలను పట్టణాలకు చివరలో ఏర్పాటుచేయాలని నిర్ణయిం చారు.
ఇంటర్ రెండో ఏడాది పత్రాలకు తొలి ప్రాధాన్యం ఇవ్వనున్నారు. మే నెలాఖరుకు ఫలితాలు విడుదల చేసేలా చర్యలు తీసుకుంటున్నారు.
వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభంలో జాప్యం జరిగితే విద్యార్థులకు ఆన్ లైన్ తరగతులు నిర్వహించాలని ఇంటర్ విద్యామండలి నిర్ణయించింది
0 Response to "24 నుంచి ఇంటర్ మూల్యాంకనం"
Post a Comment