ఆగస్టు 1 నుంచి విద్యా సంవత్సరం

 యూనివర్సిటీలు, కళాశాలు నిర్వహించాల్సిన పరీక్షలు, అకెడమిక్‌ క్యాలెండర్‌కు సంబంధించిన నూతన మార్గదర్శకాలను బుధవారంనాడు యూజీసీ విడుదల చేసింది. 




వీటి ప్రకారం.. కోర్సులో చేరిన పాత విద్యార్థులకు విద్యా సంవత్సరం ఆగస్టు 1వ తేదీ నుంచి ప్రారంభం అవుతుంది. కొత్త విద్యార్థులకు సెప్టెంబరు 1 నుంచి మొదలవుతుంది. 2020-21 సంవత్సరానికి ప్రవేశాలను ఆగస్టు 1 నుంచి ఆగస్టు 31 వరకు నిర్వహించనున్నారు. పెండింగ్‌లో ఉన్న టెర్మినల్‌, ఇంటర్మీడియెట్‌ పరీక్షలను జూలై, ఆగస్టులో నిర్వహించనున్నారు.



 పరీక్షలను తక్కువ కాలంలో పూర్తి చేయడానికి విశ్వవిద్యాలయాలు ప్రత్యామ్నాయ, సులభతర విధానాలు, పద్ధతులను అనుసరించవచ్చని యూజీసీ సూచించింది. పరీక్ష కాలాన్ని తగ్గించే అంశాన్ని పరిశీలించాలని పేర్కొంది. యూనివర్సిటీలు తమ పరిధిలోని పరిస్థితులను బట్టి సర్దుబాట్లు చేసుకోవచ్చని తెలిపింది

ప్రాజెక్టులు చేసే యూజీ/పీజీ విద్యార్థులకు తగిన వ్యూహాలను యూనివర్సిటీలు అనుసరించవచ్చు.

విశ్వవిద్యాలయాలు స్కైప్‌ లేదా ఇతర మీటింగ్‌ యాప్‌ల ద్వారా ప్రాక్టికల్‌ పరీక్షలు, వైవా పరీక్షలను నిర్వహించవచ్చు. 

ఎంఫిల్‌ లేదా పీహెచ్‌డీ విద్యార్థులు తమ థెసిస్‌ సమర్పణకు కాలపరిమితి తేదీ ముగిసినప్పటి నుంచి ఆరు నెలల సమయం ఇవ్వాలి. 

 ఫైనల్‌ ఇయర్‌ విద్యార్థులకు జులైలో పరీక్షలు నిర్వహించాలి. మిగతా విద్యార్థులకు గ్రేడ్స్‌ ఇచ్చి ప్రమోట్‌ చేయాలి. 

పరీక్షల నిర్వహణ సాధ్యంకాని పక్షంలో ఆ తరగతిలో విద్యార్థులు హాజరైన పలు పరీక్షల ఆధారంగా 50 శాతం మార్కులు కేటాయించి మిగతా 50 శాతం మార్కులను గత సెమిస్టర్లలో విద్యార్థులు చూపిన ప్రతిభ ఆధారంగా వేయాలి.  






25 శాతం పాఠాలను ఆన్‌లైన్‌లో, 75శాతం తరగతి గదిలో పూర్తి చేయాలి. 

వేసవి సెలవులను 30 రోజులు ఇవ్వాలి. 01-06-2020 నుంచి 30-06-2020 వరకు ఇవ్వాలి

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "ఆగస్టు 1 నుంచి విద్యా సంవత్సరం"

Post a Comment