ఏపీకి శుభవార్త చెప్పిన కేంద్రం..!

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి కేంద్రం శుభవార్త చెప్పింది. స్థానికసంస్థల అభివృద్ధికి కేంద్రం నిధులు విడుదల చేసింది. ఏపీకి రూ.1301.23 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. కాగా.. ఒక్క ఏపీకే కాదు అన్ని రాష్టాలకూ కేంద్రం నిధులు విడుదల చేసింది. ఈ మేరకు శనివారం రాత్రి ఓ ప్రకటనలో కేంద్ర ప్రభుత్వం ఈ వివరాలను వెల్లడించింది.



ఇదిలా ఉంటే.. స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా నేపథ్యంలో ఏపీలో పెద్ద రగడే జరిగిన సంగతి తెలిసిందే. ఎన్నికలు వాయిదా పడటంతో ఏపీకి రావాల్సిన నిధులు ఆగిపోతాయని.. నిధులు రాకుండా చేసేందుకే ప్రతిపక్షం కుట్ర పన్నిందని అధికార పార్టీ నేతలు నానా యాగీ చేశారు. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మొదలుకుని మంత్రులు, వైసీపీ నేతల వరకూ మీడియా ముందుకు వచ్చి ఈ నిధుల విషయమై ప్రతిపక్షాలపై దుమ్మెత్తిపోశారు.


అయితే.. వైసీపీ నేతల వ్యాఖ్యలపై కౌంటర్‌గా తెలుగు తమ్ముళ్లు సైతం మీడియా మీట్‌లు ఏర్పాటు చేసి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎన్నికలు వాయిదా పడినంత మాత్రాన నిధులకు ఎలాంటి ఇబ్బందులుండవని.. కచ్చితంగా వస్తాయని ఏపీ ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ కూడా చెప్పిన సంగతి తెలిసిందే. అనుకున్నట్లుగానే కేంద్రం ఇవాళ నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "ఏపీకి శుభవార్త చెప్పిన కేంద్రం..!"

Post a Comment