ఏపీలో మొట్టమొదటి కరోనా పాజిటివ్ యువకుడు డిశ్చార్జ్
నెల్లూరు
ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదట కరోనా పాజిటివ్ వచ్చిన యువకుడు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. ఇటలీలో ఎంఎస్ చదువుతున్న యువకుడు గత వారం నెల్లూరుకు వచ్చాడు. అయితే ఆ కుర్రాడికి టెస్ట్లు చేయగా పాజిటివ్ అని వచ్చింది. దీంతో ఆ యువకుడ్ని ఈ నెల 9న ప్రొఫెసర్ నరేంద్ర బృందం చికిత్స చేసింది. చికిత్స అనంతరం మూడు సార్లు పరీక్షలు నిర్వహించగా తాజాగా నెగిటివ్ అని రావడంతో డిశ్చార్జ్ చేస్తున్నట్లు వైద్యులు తెలిపారు.
కాగా.. ఈ యువకుడ్ని మరో 14 రోజుల పాటు ఇంట్లోనే క్వారంటైన్లో ఉంచి మరోసారి పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది
0 Response to "ఏపీలో మొట్టమొదటి కరోనా పాజిటివ్ యువకుడు డిశ్చార్జ్"
Post a Comment