కరోనా నేపథ్యంలో సీఎం జగన్ తాజా ప్రకటన ఇదీ
అమరావతి : కరోనా నేపథ్యంలో వైద్య, ఆరోగ్య, పోలీస్ అధికారులతో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఏపీలో పటిష్ఠంగా లాక్డౌన్ అమలుచేయాలని ఈ సందర్భంగా పోలీసు ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వీటితో పాటు అధికారులకు కొన్ని కీలక సూచనలు కూడా జగన్ చేశారు.
నిత్యావసర దుకాణాలు మాత్రమే..
‘నిత్యావసరాలకు మాత్రమే బయటికి వచ్చేందుకు అనుమతించాలి. అత్యవసర సర్వీసులు తప్ప ఎవ్వరూ కూడా ఇళ్లు విడిచి బయటకు రావొద్దు. ఇతర రాష్ట్రాల నుంచి ఏ వాహనాలు కూడా రాకుండా అడ్డుకోవాలి. గూడ్స్, నిత్యావసర వస్తువుల వాహనాలు తప్ప ఏవీ తిరగొద్దు. నిత్యావసర దుకాణాలు తప్ప మిగతావి మూసేయాలి. ప్రతి కుటుంబం నుంచి ఒక్కరిని మాత్రమే అనుమతించాలి. వారిని కూడా 3 కి.మీ పరిధికే పరిమితం చేయాలి’ అని సమీక్షలో పోలీసు అధికారులకు సీఎం జగన్ కీలక సూచనలు చేశారు.
0 Response to "కరోనా నేపథ్యంలో సీఎం జగన్ తాజా ప్రకటన ఇదీ"
Post a Comment