మీ పిల్లలను ఇలా చదివించండి

    
 
 

మీ పిల్లలను
ఇలా చదివించండి

 కోవిడ్‌ సెలవులని భయం అక్కరలేదు
 ఆన్‌లైన్‌లో అన్ని తరగతుల వాళ్లకీ పాఠాలున్నాయి
ఇ రాష్ట్రాలకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ లేఖ

సాక్షి, అమరావతి: కోవిడ్‌-18 ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా విద్యా
సంస్థలకు సెలవులు ప్రకటించిన నేపథ్యంలో పిల్లలను డిజిటల్‌/ ఇ-లెరి
ఇంగ్‌ ఫ్లాట్‌ఫారోమ్స్‌ ద్వారా చదివించుకోవాల్సిందిగా కేంద్ర మానవ
వనరుల అభివృద్ధి శాఖ సూచించింది. ఈ మేరకు తమ తమ రాష్ట్రాల్లోని
విద్యార్థులకు ఈ సమాచారం అందేలాగ చర్యలు తీసుకోవాల్సిందిగా రా
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు లేఖలు రాసింది. ఈ డిజిటల్‌/ఇ-లెర్నిం
ఫ్లాట్‌ఫారోమ్స్‌ అన్నీ కూడా ఉచితంగానే లభ్యమవుతాయని స్పష్టం చేసింది.
స్కూలు విద్య: దీక్ష వెబ్‌సైట్‌లో సీబీఎస్‌ఈ, ఎన్‌సీఈఆర్‌టీ, రాష్ట్రాలకు,
కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన సిలబస్‌లతో కూడిన పాఠ్యపుస్తకాలు
బహుళ భాషల్లో అందుబాటులో ఉన్నాయి. 1వ తరగతి నుంచి ఏడవ

తరగతి వరకు 80,000కు పైగా ఈ బుక్స్‌ అందుబాటులో ఉన్నాయి. ఇందుకు సంబంధించిన యాప్‌ను ఐజఒఎస్‌ లేదా గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. వెబ్‌సైట్‌ చిరునామా: ఇ ఇ-పాఠళూల వెబ్‌సైట్‌లో 1వ తరగతి నుంచి ఏడవ తరగతి వరకు బహుళ భాషల్లో 1,886 ఆడియోలు, 2,000 వీడియోలు, 696 ఇ-బుక్స్‌, 504 ఫ్లిప్‌ బుక్స్‌ అందుబాటులో ఉన్నాయి. వెబ్‌సైట్‌ చిరునామా: జ ఎన్‌ఆర్‌ఓఇఆర్‌ పోర్టల్‌లో వివిధ భాషల్లో మొత్తం 14,52 పైల్స్‌ ఉన్నాయి. ఇందులో 401 కలెక్షన్స్‌, 2,9 డాక్యుమెంట్స్‌, 1,845 ఇంటరాక్టిన్స్‌, 1,684 అడి యోలు, 2,586 ఇమేజెస్‌, 6,158 వీడియోలు ఉన్నాయి. వెబ్‌సైట్‌ చిరునామా జ స్వయం నేషనల్‌ ఆన్‌లైన్‌ ఎడ్యుకేషన్‌ ప్లాట్‌ఫాంలో తొమ్మిదవ తరగతి నుంచి 12వ తరగతి వరకు గ్రాడ్యుయేషన్‌, పీజీ, ఇంజనీరీంగ్‌, మానవ వనరులు, సోషల్‌ సైన్స్‌, లాకు చెందిన 19800 కోర్సులు అందుబాటులో ఉన్నాయి వెబ్‌ చిరునామా: l సనక కంటెంట్‌, బోధన.. ఆన్‌లైన్‌లోనే కోవిడ్‌ వైరస్‌ నేపథ్యంలో యూజీసీ కొత్త ప్రణాళికలు 91 వరకు అన్ని వర్సిటీల్లో వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ సాక్షి అమరావతి: కోవిడ్‌ వైరస్‌ నివారణలో భాగంగా దేశంలోని అన్ని యూనివర్సిటీలు, వాటి పరిధిలోని అన్ని విద్యా సంస్థలను మూసేసి ఇంటి నుంచే పని విధానాన్ని ఈ నెల 81 వరకు అమలు చేయాలని యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు విడుదల చేసిన ఉత్త ర్వుల్లో ఫ్యాకల్టీ మెంబర్లు, టీచర్లు, రీసెర్చి స్కాలర్లు, కాంట్రాక్టు ఉపాధ్యా యులు, బోధనేతర సిబ్బంది మొత్తం ఇంటి నుంచే విధులు నిర్వర్తించేలా చర్యలు చేపట్టాలని స్పష్టం చేసింది. ఆన్‌లైన్‌ కంటెంట్‌, ఆన్‌లైన్‌ బోధన, ఆన్‌ లైన్‌ మూల్యాంకనం కార్యక్రమాలను అభివృద్ధి చేయాలని పేర్కొంది. = వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ సందర్భంగా ఫ్యాకల్టీ సభ్యులు, ఉపాధ్యాయులు, పరిశోధకులు వివిధ విద్యా కార్యకలాపాల కోసం ఈ కాలాన్ని ఉపయోగించుకోవాలి. ఆ వచ్చే విద్యా సంవత్సరం లేదా తదుపరి సెమిస్టర్‌లో అందించే కోర్సులకు పాఠ్య ప్రణాళికను సిద్ధం చేయాలి. = బోధనా సామగ్రిని అభివృద్ధి పరచాలి.

= పరిశోధకులు ఇంటి నుంచే పరిశోధనలు కొనసాగించాలి. = వివిధ అంతర్జాతీయ జర్నల్స్‌కు, ఇతర మ్యాగజైన్‌లకు వ్యాసాలు, పేపర్లు మొదలైనవి ఇంటి నుంచే రాసి పంపించాలి. = విద్యార్థులకు ఉపయోగపడేలా ప్రశ్నలను సిద్ధం చేయాలి. = “ఏక్‌ భారత్‌ శ్రేష్ట భారత్‌ తదితర అంశాలపై వినూత్న ప్రాజెక్టులను సిద్ధం చేయాలి. = ఈ వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ కాలాన్ని విధుల్లో ఉన్నట్లు పరిగణిస్తారు. = హాస్టళ్లలో ఉన్న విద్యార్థులు ముఖ్యంగా విదేశీ విద్యార్థులుంటే వారిని హాస్టళ్లలో కొనసాగడానికి అనుమతించాలి. వారికి అవసరమైన ఏర్పాట్లు, ఇతర భద్రతా చర్యలు తీసుకోవాలి. = ఫ్యాకల్టీ సభ్యులు, ఉపాధ్యాయులు, పరిశోధకులు, బోధనేతర సిబ్బందిని సంప్రదించేందుకు మొబైల్‌ నంబర్లు, ఈ-మెయిల్‌ ఐడీ తదితర సమాచారాన్ని తమ సంస్థలకు పంపించాలి

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "మీ పిల్లలను ఇలా చదివించండి"

Post a Comment