అత్యవసర సర్వీసుగా ‘టెన్త్‌’ పరీక్షలు

అమరావతి, మార్చి 23(ఆంధ్రజ్యోతి): కరోనా వైరస్‌ వ్యాప్తి నియంత్రణకు లాక్‌డౌన్‌ ప్రకటించిన నేపథ్యంలో పదో తరగతి పరీక్షల నిర్వహణకు ఎలాంటి అడ్డంకులు 


లేకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ పరీక్షలను అత్యవసర సర్వీసుల కేటగిరీగా పరిగణిస్తున్నట్లు ప్రకటించింది. ఈ నెల 31 నుంచి జరగనున్న పరీక్షలకు 



అవసరమైన ప్రశ్నపత్రాలు, ఓఎంఆర్‌ షీట్లు, 24 పేజీల ఆన్సర్‌ బుక్‌లెట్లు, వెబ్‌ క్యామ్స్‌ రవాణాకు అనుమతులిచ్చింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బి.రాజశేఖర్‌ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "అత్యవసర సర్వీసుగా ‘టెన్త్‌’ పరీక్షలు"

Post a Comment