కరోనాలో కనిపిస్తున్న కొత్త లక్షణాలివే!

న్యూఢిల్లీ: కరోనా వైరస్ ప్రభావం యావత్ ప్రపంచంపైనా పడింది. అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతున్న కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు ముమ్ముర ప్రయత్నాలు జరుగుతున్నాయి. అలాగే ఈ వ్యాధి బారిన పడకుండా ఉండేందుకు ప్రజలు రకరకాల విధానాలను అనుసరిస్తున్నారు. జ్వరం, గొంతునొప్పి, పొడిదగ్గు, కండరాల నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది మొదలైనవి ఈ వ్యాధి లక్షణాలు. అయితే తాజాగా వీటికి మరిన్ని లక్షణాలు కూడా తోడయ్యాయి. జర్మన్ వైద్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం కరోనా బారిన పడిన వారిలో వాసన, రుచి సామర్థ్యం బలహీనపడుతుంది. 66 శాతం మంది రోగులలో ఈ లక్షణాలు కనిపించాయి. అలాగే విరేచనాలు కూడా ఈ వ్యాధికున్న మరో లక్షణంగా తెలుస్తోంది



కరోనా రోగులలో 30 శాతం మందిలో ఈ లక్షణం కూడా కనిపించింది. కరోనా వైరస్ సోకిన చాలా మంది రోగులకు మొదట జ్వరం వస్తుంది. ఇంతేకాకుండా, అలసట, కండరాల నొప్పులు, పొడి దగ్గు తదితర లక్షణాలు కనిపిస్తాయి. అదే సమయంలో కొంతమందికి ఒకటి లేదా రెండు రోజుల పాటు వాంతులు లేదా విరేచనాలు అవుతాయి

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "కరోనాలో కనిపిస్తున్న కొత్త లక్షణాలివే!"

Post a Comment