45 నిమిషాల్లో కరోనా పరీక్ష ఫలితాలు! కొత్త విధానాన్ని ఆవిష్కరించిన అమెరికా పరిశోధకులు

వాషింగ్టన్‌: కరోనా వైరస్‌ను గుర్తించేందుకు అమెరికా పరిశోధకులు నూతన విధానాన్ని ఆవిష్కరించారు. దీని వల్ల కేవలం 45 నిమిషాల్లో ఫలితాలు రానున్నాయి. బాధితుడు ఉన్న ప్రాంతానికే ఈపరికరాన్ని తీసుకెళ్లి ఉపయోగించవచ్చు. ఈ కొత్త పరీక్షా విధానానికి అమెరికా ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ శనివారం ఆమోద ముద్ర వేసింది. 



కాలిఫోర్నియాలోని ‘సెఫైడ్‌’ అనే వైద్య పరిశోధనా సంస్థ శాస్త్రవేత్తలు దీన్ని అభివృద్ధి చేశారు. మార్చి 30 నాటికి దీన్ని ఉపయోగంలోకి తీసుకొచ్చేందుకు యోచిస్తున్నట్లు ‘హెల్త్‌ అండ్‌ హ్యూమన్‌ సర్వీసెస్‌’ సెక్రటరీ అలెక్స్‌ అజర్‌ వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 23 వేల ఆటోమేటెడ్‌ జీన్‌ఎక్స్‌పర్ట్‌ సిస్టమ్స్‌పై ఈ వైద్య పరీక్ష ఫలితాలిస్తుందని సెఫైడ్‌ వర్గాలు తెలిపాయి.

కరోనా వైరస్‌ నానాటికీ విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రతిరోజూ వందల మందికి వైద్య పరీక్షలు చేయాల్సిన అవసరం ఏర్పడింది. అయితే ప్రస్తుతం ఉన్న పద్ధతిలో ఫలితాలు రావడానికి 36 నుంచి 48 గంటలు పడుతోంది. దీంతో బాధితుల్ని గుర్తించి చికిత్స అందించడంలో జాప్యం జరగుతోంది. ఆలస్యం కావడం కూడా వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందడానికి దోహదం చేస్తోంది. తాజాగా అమెరికా అందుబాటులోకి తేనున్న పరీక్షా విధానంతో రోగుల్ని త్వరగా గుర్తించే వెసులుబాటు కలుగుతుంది. దీంతో వారిని క్వారంటైన్‌లో ఉంచి వెంటనే చికిత్స అందించే ఆస్కారం ఏర్పడుతుంది. ఇది వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేయడంలో ఎంతగానో దోహదం చేస్తుంది

తాజా ఆవిష్కరణ వల్ల వైద్య వ్యవస్థపై ఉన్న ఒత్తిడిని నియంత్రించొచ్చని పరిశోధకులు అభిప్రాయపడ్డారు. దీని వల్ల వెంటిలేటర్‌ వంటి వైద్య వసతుల్ని అవసరానికి అనుగుణంగా  వినియోగించుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవచ్చన్నారు. ఈ కొత్త విధానంలో రోగి నమూనాల్ని సేకరించి ప్రత్యేకంగా ప్రయోగశాలకు పంపాల్సిన అవసరం ఉండదని వెల్లడించారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to " 45 నిమిషాల్లో కరోనా పరీక్ష ఫలితాలు! కొత్త విధానాన్ని ఆవిష్కరించిన అమెరికా పరిశోధకులు"

Post a Comment