గృహరుణంపై అదనపు మినహాయింపు
2021 మార్చి వరకు పొడిగింపు
దిల్లీ: అందుబాటు ధర గృహాలకు గిరాకీ పెంచడానికి గృహ రుణ వడ్డీపై అదనంగా రూ.1.5 లక్షల మినహాయింపును 2021 మార్చి వరకు కొనసాగించనున్నారు. రూ.2 లక్షల వరకు వడ్డీని ఆదాయం నుంచి తగ్గించి చూపించుకునేందుకు ఉద్యోగులకు అవకాశం
దానిపై మరో రూ.1.5 లక్షల మినహాయింపును గత ఏడాది బడ్జెట్లో సెక్షన్-80ఈఈఏ కింద ప్రవేశపెట్టారు. మొదటిసారిగా, అదీ రూ.45 లక్షలకు మించని ఇంటిని కొంటున్నవారికి ఇది వర్తిస్తోంది. ఈ ఏడాది మార్చి వరకు మంజూరైన గృహ రుణాలపై ఈ వెసులుబాటు ఉండగా ఇప్పుడు ఇంకో ఏడాది పొడిగించారు. 2021 మార్చిలోగా ఆమోదం పొందిన 'అందుబాటు ధర గృహనిర్మాణ ప్రాజెక్టు'లపై బిల్డర్లకు పన్ను విరామం (టాక్స్ హాలిడే) కూడా వర్తిస్తుందని ఆర్థిక మంత్రి ప్రకటించారు. అదనపు మినహాయింపు సదుపాయాన్ని ఎక్కువ మంది వినియోగించుకోవడానికి, అందుబాటు ధర గృహాలకు ప్రోత్సాహమివ్వడానికి తాజా ప్రతిపాదన చేసినట్లు చెప్పారు
0 Response to "గృహరుణంపై అదనపు మినహాయింపు"
Post a Comment