పాఠశాలల్లో'అల్పాహారం' ప్రారంభం

గుంటూరుసిటీ, న్యూస్‌టుడే : జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, జడ్పీ, ఆదర్శ పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థులకు సాయంత్రం స్టడీ అవర్‌లో అల్పాహారాన్ని శనివారం అందించారు. ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు వచ్చే నెల వరకు విద్యార్థులకు పోషక విలువలు పెంపొందించే అల్పాహారాన్ని తప్పనిసరిగా ప్రతిరోజు అందించాలని డీఈవో ఆర్‌ఎస్‌.గంగాభవాని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇందులో భాగంగా గుంటూరు చౌత్ర కూడలిలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థినులకు అల్పాహారాన్ని అందించారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "పాఠశాలల్లో'అల్పాహారం' ప్రారంభం"

Post a Comment