Exam Tips | పదోతరగతి పిల్లలను పరీక్షలకు ప్రోత్సహించండిలా.

పదో తరగతి విద్యార్ధులు పరీక్షలకు సన్నద్దమవుతున్నప్పుడు తల్లిదండ్రుల పాత్ర కూడా చాలా ముఖ్యమైంది అంటున్నారు ఉపాధ్యాయురాలు శ్రీదేవి. పిల్లలను ఇతర విద్యార్థులతో పొల్చడం వారిలో ఆత్మస్థైర్యం దెబ్బతినేలా మాట్లాడడం చేయకూడదు అంటున్నారు.

తల్లిదండ్రులు ముఖ్యంగా పాటించాల్సిన అంశాలు... 

  • పిల్లలపై ఒత్తిడి పెరిగేలా వ్యవహరించకూడదు. మీ పనులతో ఎంత బిజీగా ఉన్నా కొద్దిపాటి సమయాన్నైనా పిల్లలతో గడపడానికి కేటాయించాలి.

  • మార్కులు, గ్రేడ్లు ప్రస్తావన వచ్చే విధంగా తల్లిదండ్రులు పిల్లలతో మాట్లాడకూడదు.

  • ఉదయం, సాయంత్రం ఖాళీ లేకుండా పిల్లలను ట్యూషన్స్ లో వేసేస్తే తమ బాధ్యత అయిపోతుందని భావించవద్దు.

  • తమ పాఠ్యాంశాల్లో ఎమైనా అర్ధం కాకపోతే తల్లిదండ్రులు పిల్లలకు సహయం అందించాలి.
  • పిల్లల్లో ఆత్మస్థైర్యాన్ని పెంచే విధంగా వాళ్లను ప్రొత్సహించడం వలన మంచి మార్కులు సాధించే అవకాశాలు ఉంటాయంటున్నారు నిపుణులు.

  • దీంతో పాటు పిల్లలు సరైన సమయంలో మంచి ఆహారం అదించడంతోపాటు వాళ్లు సమయానికి నిద్రపోయే విధంగా కూడా చూసుకోవాలి.

  • తల్లిదండ్రులు ఇలా పిల్లలను ప్రొత్సహిస్తే పరీక్షల సమయంలో ఒత్తిడి లేకుండా మంచి మార్కులు సాధిస్తారని అంటున్నారు ఉపాధ్యాయురాలు శ్రీదేవి.



ఇదిలా ఉంటే స్టేట్ బోర్డు సెకండరీ ఎడ్యుకేషన్ ఆఫ్ తెలంగాణ పదోతరగతి పరీక్షల షెడ్యూల్‌ను ఇప్పటికే విడుదల చేసింది


SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "Exam Tips | పదోతరగతి పిల్లలను పరీక్షలకు ప్రోత్సహించండిలా."

Post a Comment