పన్ను చెల్లింపునకు ఇకపై రెండు విధానాలు

చెల్లింపుదారులే నిర్ణయించుకోవాలి

దిల్లీ : ప్రభుత్వం పన్ను ఎంపికను చెల్లింపుదారుల ఇష్టానికే వదిలసేంది. ఇకపై పన్ను చెల్లింపుదారులు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లుగా కాకుండా తమకు నచ్చిన విధానాన్ని ఎంచుకోవచ్చు. ఎందుకంటే ఆదాయపు పన్ను చెల్లింపునకు ఇకపై రెండు విధానాలను ఈ బడ్జెట్‌లో కేంద్రం తీసుకువచ్చింది. పన్ను చెల్లింపునకు ఇకపై రెండు విధానాలు ఉండనున్నట్లు కేంద్ర బడ్జెట్‌లో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. పాత విధానమా? కొత్త విధానమా? అనే దానిని పన్ను చెల్లింపుదారులే ఆలోచించుకొని నిర్ణయించుకోవాలి





అయితే ఇక్కడ కొన్ని షరతులు ఉన్నాయి. కొత్త విధానంలోకి మారితే ఎలాంటి మినహాయింపులు ఉండవు. పాత విధానంలో అయితే మినహాయింపులు కొనసాగుతాయి.

కొత్త విధానం..

0-రూ.2.5లక్షలకు పన్నులేదు

రూ.2.5లక్షలు-రూ.5లక్షలకు 5శాతం (ఆదాయం రూ.5లక్షల లోపు ఉంటే రిబేట్‌ వర్తించి పన్ను పడదు. అదే ఆదాయం రూ.5 లక్షలు దాటిందంటే రిబేట్‌ వర్తించదు. అప్పుడు రూ.2.5లక్షల నుంచి రూ.5లక్షల మధ్య ఉండే రూ.2.5లక్షలకు 5శాతం పన్ను చెల్లించాలి)

రూ.5లక్షలు - రూ.7.5లక్షలకు 10శాతం

రూ.7.5లక్షలు-రూ.10 లక్షలకు 15శాతం

రూ.10లక్షలు-రూ.12.5లక్షలకు 20శాతం

రూ.12.5లక్షలు-రూ.15లక్షలకు 25శాతం

రూ.15లక్షలు నుంచి 30శాతం

అయితే ఈ విధానాన్ని ఎంచుకునే వారికి 80సీ, 80డీ వంటివి, ఎల్‌టీసీ, హెచ్‌ఆర్‌ఏ లాంటి మినహాయింపులు ఉండవు. కొత్త విధానంలో వంద రకాల్లో 70 మినహాయింపులను తొలగించినట్లు బడ్జెట్‌ ప్రసంగంలో ఆర్థిక మంత్రి పేర్కొన్నారు


పాత విధానం

రూ 2.5లక్షల నుంచి 5 లక్షల వరకు 5 శాతం

రూ.5లక్షల నుంచి రూ.10లక్షల వరకు 20 శాతం

రూ.10లక్షల నుంచి అపై మొత్తం 30 శాతం పన్ను చెల్లించాలి.

ఈ విధానంలో పన్ను చెల్లింపు దారులకు మినహాయింపులు కొనసాగుతాయి.

దీర్ఘకాలంలో మినహాయింపులు తొలగిస్తాం 
కార్పొరేట్‌ పన్నుల్లో చేసిన విధంగానే ఆదాయ పన్నుల్లో మార్పులు తీసుకొచ్చినట్లు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ అనంతరం మీడియాతో మాట్లాడుతూ వెల్లడించారు. సరళీకృతమైన విధానం కావాలంటే కొత్త విధానంలోకి మారవచ్చని సూచించారు. 'ఆదాయపన్ను విధానాన్ని సరళీకరించాలన్నదే మా ఉద్దేశం. పన్ను రేట్లు తగ్గించేందుకే మా ప్రయత్నం. దీర్ఘకాలంలో మినహాయింపులు మొత్తం తొలగిస్తాం. తక్కువ పన్ను రేట్లు ఉండేలా చర్యలు తీసుకుంటాం. వడ్డీ రాయితీ పథకం, పన్ను మినహాయింపులు మరో ఏడాది పొడిగించాం ట్యాక్స్‌ చాటర్‌ అనేది విప్లవాత్మక నిర్ణయం. సంపద సృష్టికర్తలకు ఎలాంటి వేధింపులు ఉండకూడదు.' అని సీతారామన్‌ 

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "పన్ను చెల్లింపునకు ఇకపై రెండు విధానాలు"

Post a Comment