బడ్జెట్‌ 2020: కొత్త విధానంలో మీ ఆదాయపన్ను ఇలా.

దిల్లీ: ఆదాయపన్ను శ్లాబ్‌ల్లో మార్పులు చేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌ - 2020లో ప్రకటన చేసింది. ఈ మేరకు ఆదాయపన్ను శ్లాబ్‌ల సంఖ్యను కూడా పెంచారు. పాత శ్లాబులను కొనసాగిస్తూనే కొత్త శ్లాబులను ప్రవేశపెట్టారు. వీటిలో ఏది ఎంచుకోవాలనేది చెల్లింపుదారుడి అభిమతమని కేంద్ర ఆర్థిక శాఖమంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రసంగంలో తెలిపారు. కొత్త విధానంలో 80సి, 80డి, ఎల్‌టీసీ, హెచ్‌ఆర్‌ఏ, స్టాండర్డ్‌ డిడక్షన్‌, బీమా ప్రీమియం, పీఎఫ్‌, పింఛన్‌ ఫండ్‌ల మినహాయింపులు ఉండవు. మొత్తంగా కొత్త విధానంలో 100 రకాల పన్ను మినహాయింపుల్లో 70 వరకు తొలగించారు




అలాగే రూ. ఐదు లక్షలలోపు ఆదాయం ఉన్నవాళ్లు రిబేట్‌తో కలుపుకుంటే పన్ను చెల్లించక్కర్లేదు. కొత్త విధానంలో మీ ఆదాయపన్నులో మార్పులు ఇలా ఉండనున్నాయి. ఎంత ఆదాయానికి, ఎంత పన్ను ఉండొచ్చనేది ఈ పట్టిలో చూడొచ్చు.

NEW INCOME TAX SLAB RATES FOR 2020-2021 FISCAL YEAR 
(1) Upto 5,00,000 - No Income Tax 
(2) 5,00,00 to 7,50,000 - 10% 
(3) 7,00,000 to 10,00,000 - 15% 
(4) 10,00,000 to 12,50,000 - 20% 
(5) 12,00,000 to 15,00,000 - 25% 
(6) 15,00,000 and above - 30%

ఈ మినహాయింపులు ఉండవ్‌

  • ఇంటి అద్దె, గృహ రుణ వడ్డీ, ఆరోగ్య బీమా
  • జీవిత బీమా, ఎల్టీసీ, పీఎఫ్‌.. తగ్గింపులన్నీ గాయబ్‌

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రతిపాదించిన కొత్త ఆదాయపన్ను విధానంలో పన్ను రేట్లు తగ్గుతాయిగానీ.. పాత విధానంలో ఇచ్చిన పలు మినహాయింపులు, తగ్గింపులు పోతాయి. అవేంటంటే..

  • 80సీ, 80సీసీసీ, 80సీసీడీ సెక్షన్ల కింద గరిష్ఠంగా లభించే రూ.1.5 లక్షల మినహాయింపు పోతుంది. ప్రజా భవిష్యనిధి (పీపీఎఫ్‌), ఉద్యోగ భవిష్య నిధి (ఈపీఎఫ్‌), బ్యాంకులో వేసే ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, ఆరోగ్య బీమా, ఎల్‌ఐసీ ప్రీమియమ్‌లు, పిల్లల ట్యూషన్‌ ఫీజులు వంటివి ఈ సెక్షన్ల కిందికి వస్తాయి.
  • 80 డి కింద ఆరోగ్య బీమా (మామూలు వ్యక్తులకు రూ.25 వేలు, వృద్ధులకైతే రూ.30 వేలు) పై మినహాయింపు పోతుంది.
  • సెక్షన్‌ 80టీటీఏ కింద.. పొదుపు ఖాతాలపై వచ్చే వడ్డీ (రూ.10 వేల లోపు) మినహాయింపు పోతుంది.
  • ఈక్విటీ సేవింగ్‌ పథకాల్లో పెట్టే సొమ్ములో 50 శాతం (గరిష్ఠంగా రూ.25 వేలు)పై 80 సీసీజీ కింద వర్తించే పన్ను మినహాయింపు లభించదు.
  • ఎలక్ట్రిక్‌ వాహనాల కొనుగోలుపై సెక్షన్‌ 80ఈఈబీ కింద.. ఉన్నత విద్యకు తీసుకునే రుణాలపై వడ్డీకి సంబంధించి సెక్షన్‌ 80ఈ కింద (దీనికైతే పరిమితి లేదు).. దాతృత్వ సంస్థలకు ఇచ్చే విరాళాలపై 80జీ కింద.. వైద్య ఖర్చులపై సెక్షన్‌ 80 డీడీబీ కింద.. ఉద్యోగులకు ఎల్టీసీ, హౌస్‌ రెంటు అలవెన్స్‌ (అద్దె భత్యం)కింద ఇస్తున్న చాలా మినహాయింపులు పోతాయి

మోదీ ప్రభుత్వం కేంద్ర బడ్జెట్ 2020ను ప్రవేశపెట్టింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇందులో చాలా కీలక నిర్ణయాలు ప్రతిపాదించారు. ఇందులో వ్యక్తిగత ఆదాయపు పన్ను స్లాబుల మార్పు సహా పన్ను రేటు తగ్గింకు వంటి అంశాలు కూడా ఉన్నాయి. రెండు ఆప్షన్లు.. కేంద్ర ప్రభుత్వం పాత విధానం అమలులో ఉంటుందని, అలాగే కొత్త విధానం నచ్చితే దీన్ని ఫాలో కావొచ్చని ఆప్షన్ ఇచ్చింది. అంటే మీకు ఏ విధానం నచ్చితే దాన్ని ఫాలో అవ్వొచ్చు. ఇప్పుడు రెండింటి మధ్య ఏ విధానాన్ని అనుసరిస్తే బాగుంటుందో ఒకసారి తెలుసుకుంద్దాం. పన్ను మినహాయింపులు బంద్ కొత్త విధానంలో పన్ను చెల్లించాలని భావిస్తే.. ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవడం మంచిది

ఎందుకంటే కొత్త విధానంలో మీకు ఎలాంటి పన్ను మినహాయింపుల లభించవు. అన్నింటినీ వదులుకోవలసి వస్తుంది. పీఎఫ్ అకౌంట్, పీపీఎఫ్ వంటివి ఉన్నాయా? కొత్త వ్యక్తిగత ఆదాయపు పన్ను విధానంలో సెక్షన్ 80సీ పన్ను మినహాయింపు ఉండవు.

అంటే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, ఎన్‌పీఎస్, లైఫ్ ఇన్సూరెన్స్ వంటి వాటిపై ఇన్వెస్ట్ చేసిన డబ్బులకు ట్యాక్స్ తగ్గింపు పొందటం కుదరదు. అలాగే సెక్షన్ 80డీకి కూడా ఇదే వర్తిస్తుంది. ఇంకా హెచ్ఆర్ఏ, హోమ్ లోన్ వడ్డీ రేటుపై మినహాయింపు వంటివి కూడా కోల్పోతాం. ఇంతటితో అయిపోలేదు.

వికలాంగులు, చారిటబుల్ డొనేషన్స్‌కు కూడా మినహాయింపులు ఏమీ ఉండవు. పన్ను రేటు తక్కువే.. కానీ.. కొత్త వ్యక్తిగత ఆదాయపు పన్ను వ్యవస్థ కింద తక్కువ పన్ను రేటుకే ట్యాక్స్ చెల్లించాలని భావిస్తే..

అప్పుడు పన్ను మినహాయింపు, తగ్గింపులు వదులుకోవాలి. అందువల్ల కొత్త విధానంలో ఎక్కువ లాభం పొందగలమా? లేదంటే పాత విధానంలోనే ప్రయోజనం ఎక్కువగా ఉందా? అని బేరీజు వేసుకొని ఒక నిర్ణయానికి రావడం మంచిది.

కొత్త పన్ను చెల్లింపు విధానం సింపుల్ కొత్త విధానం చూడటానానికి చాలా సింపుల్‌గా ఉంది. ఎలాంటి మినహాయింపులు లేవు. తక్కువ పన్ను రేటు పడుతుంది. అయితే ఇక్కడ కొంత మంది పన్ను ఆదా కోసం ఇప్పటికే పలు ఇన్వెస్ట్‌మెంట్ సాధనాల్లో డబ్బులు పెడుతూ వస్తుంటారు.

ఇలాంటి వారు వాటిల్లో ఇన్వెస్ట్‌మెంట్లను సడన్‌గా నిలిపివేయడం కుదరదు కదా? అందువల్ల పాత విధానంలో కొనసాగే అవకాశం ఉండొచ్చు. పన్ను చెల్లింపుదారులు కొత్త విధానాన్ని ఎంచుకుంటే ఎలాంటి ప్రయోజనాలు కోల్పోతారో ఒకసారి చూద్దాం.. 1. వేతన జీవులు పొందుతున్న లీవ్ ట్రావెల్ అలవెన్స్ మినహాయింపు కోల్పోతారు.

2. ఇంటి అద్దె అలవెన్స్ ప్రయోజనం కూడా ఉండదు. హౌస్ రెంట్ అలవెన్స్‌పై కొంత మొత్తం వరకు పన్ను మినహాయింపు పొందొచ్చు. కొత్త విధానంలో ఈ సదుపాయం ఉండదు.

3. శాలరీ తీసుకుంటున్న ఉద్యోగులు రూ.50,000 వరకు స్టాండర్డ్ డిడక్షన్ పొందొచ్చు. ఈ ఫెసిలిటీ కూడా పోతుంది. 4. ఎంటర్‌టైన్‌మెంట్ అలవెన్స్, ఎంప్లాయిమెంట్/ప్రొఫెషనల్ ట్యాక్స్ డిడక్షన్ కూడా ఉండదు.

5. హౌసింగ్ లోన్ వడ్డీ చెల్లింపుపై పొందే పన్ను ప్రయోజనం కూడా కోల్పోవలసి వస్తుంది. ప్రస్తుతం సెక్షన్ 24 కింద ఈ బెనిఫిట్ లభిస్తోంది. 6. సెక్షన్ 57లోని క్లాజ్ (ఐఐఏ) ప్రకారం..

ఫ్యామిలీ పెన్షన్ నుంచి రూ.15,000 వరకు పన్ను తగ్గింపు ప్రయోజనాలు పొందొచ్చు. ఈ బెనిఫిట్ కూడా పోతుంది. 7. ప్రావిడెంట్ ఫండ్, లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం, పిల్లల స్కూల్ ట్యూషన్ ఫీజు వంటి వాటిపై సెక్షన్ 80సీ కింద పన్ను తగ్గింపు పొందొచ్చు.

ఇంకా ఎన్‌పీఎస్, పీపీఎఫ్, ఈఎల్ఎస్ఎస్ వంటి వాటిపై కూడా ఈ సెక్షన్ కింద ఎలాంటి ప్రయోజనాలు పొందటం వీలుకాదు. 8. సెక్షన్ 80డీ కింద మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియంపై పొందే పన్ను తగ్గింపు బెనిఫిట్‌ను ఇకపై పొందలేం. ఈ సెక్షన్ల కింద ఇక నో బెనిఫిట్ కొత్త పన్ను చెల్లింపు విధానాన్ని ఎంచుకుంటే సెక్షన్ 80సీ, సెక్షన్ 80సీసీసీ, సెక్షన్ 80సీసీడీ, సెక్షన్ 80డీ, సెక్షన్ 80డీడీ, సెక్షన్ 80డీడీబీ, సెక్షన్ 80ఈ, సెక్షన్ 80ఈఈ, సెక్షన్ 80ఈఈఏ, సెక్షన్ 80ఈఈబీ, సెక్షన్ 80జీ, సెక్షన్ 80జీజీ, సెక్షన్ జీజీఏ, సెక్షన్ 80జీజీసీ, సెక్షన్ 80ఐఏ, సెక్షన్ 80ఐఏబీ, సెక్షన్ 80ఐఏసీ, సెక్షన్ 80ఐబీ, సెక్షన్ 80ఐబీఏ వంటి వాటి కింద ఇకపై పన్ను మినహాయింపులు, తగ్గింపులు పొందటం సాధ్యం కాదు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "బడ్జెట్‌ 2020: కొత్త విధానంలో మీ ఆదాయపన్ను ఇలా."

Post a Comment