పరీక్షల్లో మార్కులే సర్వస్వం కాదు

  • సొంత ప్రిపరేషన్‌పై నమ్మకం ఉంచండి
  • ‘పరీక్షా పే చర్చ’లో విద్యార్థులతో ప్రధాని మోదీ
న్యూఢిల్లీ, జనవరి 20: పరీక్షల్లో మంచి మార్కులు సాధించడం ఒక్కటే సర్వస్వం కాదని విద్యార్థులకు ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. పరీక్షలే సకలమనే ఆలోచన నుంచి బయట పడాలని చెప్పారు. సోమవారం ఢిల్లీలోని తాల్కతోరా స్టేడియంలో నిర్వహించిన ‘పరీక్షా పే చర్చ’ కార్యక్రమానికి ప్రధాని హాజరై విద్యార్థులతో ముచ్చటించారు. పరీక్షల తరుణంలో వారిపై ఉండే ఒత్తిడిని దూరం చేయడానికి సలహాలు ఇచ్చారు


తనను విద్యార్థులకు స్నేహితునిగా పరిచయం చేసుకున్న ప్రధాని... ‘హ్యాష్‌ట్యాగ్‌ విత్‌అవుట్‌ ఫిల్టర్‌’ పేరిట తనతో మాట్లాడాలని, ప్రశ్నలు అడగాలని కోరారు. వివిధ రాష్ట్రాలకు చెందిన 2వేల మంది విద్యార్థులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కొత్త టెక్నాలజీ గురించి తెలుసుకోవాలని చెబుతూనే అది మన జీవితాలను శాసించేలా చేసుకోకూడదని ప్రధాని చెప్పారు. మన ఇంట్లో టెక్నాలజీకి తావు లేని గది ఒకటి ఉండాలన్నారు.
 
ఎప్పుడు చదువుకోవాలి?
‘‘నేనో గుడ్లగూబను. ఉదయానే నిద్ర లేవలేను. రాత్రి మేల్కొని ఉంటాను. చదవడానికి ఏ సమయం మంచిది?’’ అని ఓ విద్యార్థి అడిగిన ప్రశ్న ప్రధానిని ఆకట్టుకుంది. ‘‘వేకువజామున మైండ్‌ వర్షం తర్వాత ఆకాశమంత ఫ్రెష్‌గా ఉంటుంది. సూర్యోదయం, సూర్యాస్తమయం వేళల్లో పక్షుల రాగాలూ భిన్నంగా ఉంటాయి. పొదున్నే నిద్రలేచి చదువుకోవడం మంచిది.’’ అని చెప్పారు.
ఒత్తిడి పోయింది..ధైర్యం పెరిగింది : తెలంగాణ విద్యార్థులు
 పరీక్షలను ఎదుర్కోవడానికి ప్రధాని మోదీ సలహాలు, సూచనలు ఇచ్చారని, ఆయనతో సంభాషించడంతో తమ ఒత్తిడి పోయిందని, మనోధైర్యం పెరిగిందని తెలంగాణ విద్యార్థులు తెలిపారు. ‘పరీక్షా పే చర్చ’లో తెలంగాణలోని వివిధ పాఠశాలలకు చెందిన 19 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ప్రధాని మోదీ స్ఫూర్తిదాయక ప్రసంగం చేశారని జగిత్యాల మోడల్‌ స్కూల్‌ ప్రిన్సిపల్‌ సరితా దేవి విలేకరులతో 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Related Posts :

0 Response to " పరీక్షల్లో మార్కులే సర్వస్వం కాదు"

Post a Comment