సీబీఎస్ఈ పరీక్ష విధానంలో మార్పులు
ఇండోర్:
సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎ్సఈ) 12వ తరగతి పరీక్ష
విధానంలో మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రైవేటు విద్యార్థులకు సంబంధించి
ఆరు సబ్జెక్టుల్లో పాత(2019) విధానంలోనే పరీక్షలు నిర్వహిస్తారు. తొమ్మిది
సబ్జెక్టుల్లో మాత్రం 2020 సంవత్సరానికి నిర్దేశించిన నమూనా పత్రాల
విధానాన్నే అనుసరిస్తారు.
మాస్ మీడియా స్టడీస్,
లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్, టైపోగ్రఫీ అండ్ సీఏ ఇంగ్లిష్,
షార్ట్హ్యాండ్ ఇంగ్లిష్, టైపోగ్రఫీ అండ్ సీఏ హిందీ, వెబ్ అప్లికేషన్
సబ్జెక్టుల్లో పాత పరీక్ష విధానాన్నే కొనసాగిస్తామని సీబీఎ్సఈ
హెల్ప్లైన్ కౌన్సెలర్ జయదేవ్కర్ తెలిపారు. ఇక ప్రైవేటుగా హాజరయ్యే
విద్యార్థులకు 9 సబ్జెక్టుల్లో 2020 విధానాన్ని అనుసరిస్తామన్నారు. దీనికి
సంబంధించి నమూనా ప్రశ్నపత్రాలను బోర్డు వెబ్సైట్లో ఉంచామని తెలిపారు
0 Response to " సీబీఎస్ఈ పరీక్ష విధానంలో మార్పులు"
Post a Comment