ఎయిర్టెల్: కనీస రీఛార్జి డబుల్!
ఇంటర్నెట్డెస్క్: ప్రముఖ టెలికాం కంపెనీ ఎయిర్టెల్ వినియోగదారులకు మరో షాకిచ్చింది. ప్రీపెయిడ్ కనీస రీఛార్జి మొత్తాన్ని దాదాపు రెట్టింపు చేసింది. ఇప్పటి వరకు రూ.23గా ఉన్న మొత్తాన్ని రూ.45 చేసింది. అంటే అవాంతరాలు లేని ఎయిర్టెల్ సేవలు పొందాలంటే వినియోగదారులు నెలకు మరో రూ.22 అదనంగా చెల్లించాలన్నమాట! పెంచిన కనీస రీఛార్జి మొత్తాన్ని నేటి నుంచే అమలు చేస్తున్నామని ఆ కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది.
ఇకపై 28 రోజులకు ఎయిర్టెల్ వినియోగదారులు నెలకు రూ.23కు బదులు రూ.45 రీఛార్జి చేసుకోవాల్సి ఉంటుంది. ఈ రీఛార్జితో ఎలాంటి డేటా, ఉచిత కాల్స్ లభించవు. రూ.45 లేదా అంతకంటే ఎక్కువ మొత్తం రీఛార్జి చేయకుంటే గత ప్లాన్ గ్రేస్ పీరియడ్ ముగిసిన తర్వాత సేవలను నిలిపివేస్తామని కంపెనీ పేర్కొంది.
ప్రీపెయిడ్ రీఛార్జి పథకాల మొత్తాల్ని ఇటీవలే దాదాపు 50 శాతం మేర పెంచిన ఎయిర్టెల్.. తాజాగా మరోసారి వినియోగదారులపై భారం మోపడం గమనార్హం
నా మొబైల్ నెం.9849517832 కు ప్రతి నెల ఉచిత అన్ లిమిటెడ్ కాల్స్ కొరకు మరియు ఇంటర్ నెట్ సేవలు రోజుకు 2GB కొరకు ఎయిర్ టెల్ కంపెనీ వారు ఆఫర్ ప్రకారం 28 రోజులకు Enjoy TRULY unlimited Local, STD & Roaming calls on any network, 2 GB data, 300 National SMS for 28 days charge:149/-లు రీచార్జ్ చేయించుకుంటే వారం రోజుల తరువాత నెట్ పని చేయడం లేదు. ఉచిత కాల్స్ మాత్రమె పని చేస్తుంది.
ReplyDelete