విద్యార్థులకు నాసిరకం బూట్లు
పంపిణీచేసిన నాలుగు
మాసాలకే దెబ్బతిన్న వైనం
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో
ప్రభుత్వ పాఠశాలల్లో అందజేసిన
బూట్లు చినిగిపోవడంతో విద్యార్థులు తిరిగి
చెప్పులతోనే పాఠశాలలకు వస్తున్న పరిస్థితి
నెలకొంది. విద్యార్థులకు అందజేసిన బూట్లు
నాలుగు నెలలు గడవక ముందే
పాడైయాయి. ఒకటి నుంచి తొమ్మిదో తరగతి
విద్యార్థులకు ఈ ఏడాది ఒక జత బూట్లతో
పాటు రెండు జతల సాక్సులను పాఠశాల
విద్యాశాఖ అందజేసిన విషయం తెలిసిందే.
ఒక్కో విద్యార్థికి రూ.254ల చొప్పున ఖర్చు
చేసిన ఎస్ఎస్ఎ, ఒక జత బూట్లు, రెండు
జతల సాక్సులను కొనుగోలు చేసి
విద్యార్థులకు అందజేసింది. నాణ్యత లేని
బూట్లు అందజేయడంతో ఇచ్చిన కొద్దిరోజుల్లో
అవి. చినగడం ప్రారంభమయ్యాయి.
విద్యార్థుల బూట్ల టెండర్లను నర్వశిక్షా
అభియాన్(ఎస్ఎస్ఎ) ఫిబ్రవరిలో ఖారారు
చేసింది. ప్రభుత్వ పంచాయతీ, మున్సిపల్,
ఎయిడెడ్ పాఠశాలల్లో చదువుతున్న
29. 50లక్షల మంది విద్యార్థులకు బూట్లు
అందజేయాలని నిర్ణయం తీసుకుంది.
దీనికోసం సుమారు రూ.?6కోట్లను
పాఠశాల విద్యాశాఖ బడ్జెట్ను
కేటాయించింది. ఈ ఏడాది బడులు తెరిచిన
శ్రజణాశకీ .:;
27 0669౫06౧ 2019
ని స్సు 6౧౩౧6, ౧౧౩౫౩54|6€1, 60[1/6/473 12073
తరువాత విద్యార్థులకు అందజేయడం ఎస్-
ఎస్ఎ ప్రారంభించింది. జులై చివరి నాటికి
రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు బూట్లను
అందజేసింది. గత ప్రభుత్వం హయాంలో
అధిక ధరతో ఎస్ఎస్ఎ టెండర్లను
పిలిచిందని ఆ సమయంలో అనేక
విమర్శలు, ఫిర్యాదులు వచ్చాయి. బయట
మార్కెట్లో టెండరుదారులు అందజేసే
బూట్లు రూ.120లకే దొరుకుతున్నాయి.
హోలొసేల్గా ఈ ధర ఇంకా తగ్గే అవకాశం
ఉంది. ఎస్ఎస్ఎ మాత్రం రూ.254ల
చొప్పున టెండర్లను పిలిచింది. ఉత్తరప్రదేశ్
ప్రభుత్వం ఇదే తరహా బూట్లు, సాక్సులకు ఆ
రాష్ట్ర విద్యార్థులకు రూ.94ల చొప్పున
టెండర్లను ఖరారు చేసి అప్పగించింది.
రాష్ట్రలో మాత్రం ఎస్ఎస్ఎ జతకు
అదనంగా సుమారు రూ. 150లు టెండర్లను
ఖరారు చేసింది. ప్రభుత్వం మారిన
తరువాత వచ్చిన ఎస్ఎస్ఎ డైరెక్టర్
చినవీరభద్రుడు వెంటనే బూట్ల సరఫరా
నిలిపివేయాలని కం పెనీలకు ఆదేశాలు జారీ
చేశారు. అయితే అప్పటికే 90శాతం బూట్లు
లకు చేరాయి. కేవలం 10శాతం
బూట్లు మాత్రమే సరఫరా కాకుండా
మిగిలిపోయాయి. ప్రభుత్వం ఇంత ఖర్చు
చేసినా ప్రయోజనం లేకుండా పోయిందనే
అభిప్రాయాన్ని తల్లిదండ్రులు,
ఉపాధ్యాయులు వ్యక్తం చేస్తున్నారు
0 Response to "విద్యార్థులకు నాసిరకం బూట్లు"
Post a Comment