అమ్మఒడి.. మూత‘బడి


హాలహర్వి, మద్దికెర, నవంబరు 27: పిల్లలందరినీ బడి బాట పట్టించేందుకే అమ్మఒడి పథకమని ప్రభుత్వం చెబుతోంది. ఇప్పుడు



ఆ పథకమే బడులు మూతపడేందుకు కారణమయ్యింది. కర్నూలు జిల్లా హాలహర్వి మండలం టి.సాకిబండలోని ప్రాథమిక పాఠశాల ఈవిధంగానే మూతపడింది. ఈ పాఠశాలలో 40 మంది విద్యార్థులు ఉన్నారు. జూలైలో ఇక్కడి ఉపాధ్యాయుడు బదిలీ కావడంతో నెల రోజులపాటు పాఠశాల మూతబడింది. దీనిపై ‘ఆంధ్రజ్యోతి’ కథనాలకు స్పందించి ప్రత్యామ్నాయంగా సీఆర్పీని నియమించారు.
 
మూడు రోజులుగా సీఆర్పీ కూడా పాఠశాలకు రావడం లేదు. ఈ విషయాన్ని ఎంఈవో దృష్టికి తీసుకెళ్లగా అమ్మ ఒడి నమోదు కోసం సీఆర్‌పీ ఆఫీసుకు వచ్చారని చెప్పారు. మద్దికెర మండలం కొత్తపల్లిలోనూ ఇదే పరిస్థితి. 30మంది విద్యార్థులుండే ఇక్కడి ప్రాథమిక పాఠశాలలో ప్రస్తుతం నలుగురే ఉన్నారు. పంచాయతీ పరిధిలోని హంప గ్రామం నుంచి ఉపాధ్యాయులు రొటేషన్‌ పద్ధతిన వచ్చి ఇక్కడ పాఠాలు చెబుతుండేవారు. బుధవారం ఎవరూ పాఠశాలకు రాలేదు. దీనిపై ఎంఈవోను వివరణ కోరగా అమ్మఒడి పథకం నమోదులో ఉపాధ్యాయులు బిజీగా ఉన్నారని, అందువల్లే పాఠశాలకు వెళ్లలేదని చెప్పారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "అమ్మఒడి.. మూత‘బడి"

Post a Comment