అమ్మో.. ఆరోగ్యశ్రీ
- నెట్వర్క్ ఆస్పత్రులకు భారంగా మారిన పథకం
- విశాఖలో ప్రముఖ ఆస్పత్రికి ఏకంగా 16లక్షలు ఫైన్
- కట్టిన వెంటనే నెట్వర్క్ నుంచి తొలగిన యాజమాన్యం
- భారీగా బకాయిలు... బిల్లుల్లో కటింగ్లతో బెంబేలు
- ఆరోగ్యమిత్రలు, టీమ్లీడర్ల జీతాల భారం వేసే యోచన
- ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్న ఆరోగ్యశ్రీ ట్రస్ట్ అధికారులు
- భవిష్యత్ కార్యాచరణపై నేడు, రేపు సమావేశాలు
అమరావతి, నవంబరు 24(ఆంధ్రజ్యోతి):
ఆరోగ్యశ్రీ ట్రస్ట్ దెబ్బకు నెట్వర్క్ ఆస్పత్రులు బెంబేలెత్తుతున్నాయి.
భారీగా బకాయిలు, బిల్లుల్లో కటింగ్లు, లక్షల రూపాయిల పెనాల్టీలతో
ట్రస్ట్ అధికారులు వీటిని హడలెత్తిస్తున్నారు. దీంతో ప్రధాన నగరాల్లోని
ప్రముఖ ఆస్పత్రులు నెట్వర్క్ నుంచి బయటకు వచ్చేస్తున్నాయి. ఇప్పటికే
విశాఖలో రెండు, విజయవాడలో మూడు నెట్వర్క్ నుంచి తప్పుకున్నట్లు సమాచారం.
ఆస్పత్రులపై ట్రస్ట్ అధికారులు భారీగా పెనాల్టీలు వేస్తున్నారు. రూ.వంద
తప్పు జరిగిందని తెలిస్తే దానికి పదిరెట్లు జరిమానా రూపంలో భారం
మోపుతున్నారు. ఇటీవల విశాఖలోని ఒక జాతీయ స్థాయి ఆస్పత్రికి రూ.16లక్షల
పెనాల్టీ వేశారు. ఆ మొత్తం కట్టిన వెంటనే సదరు ఆస్పత్రి యాజమాన్యం
నెట్వర్క్ నుంచి తప్పుకుంది. అలాగే విజయవాడలో 2ఆస్పత్రులకు రూ.15లక్షల
వరకూ జరిమానాలు వేయడంతో అవీ బయటకు వచ్చేందుకు
గతంలో ఒక ఆస్పత్రి
తప్పు చేసిందని తెలిస్తే ముందుగా డిసిప్లీనరీ కమిటికి పంపించేవారు. అక్కడ
రుజువైతే సాధారణ పెనాల్టీతో సరిపెట్టేవారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి
లేదని, కేవలం ఆరోగ్యమిత్రా నిర్ధారించినా భారీగా పెనాల్టీలు వేస్తున్నారని
ఆస్పత్రుల యాజమాన్యాలు వాపోతున్నాయి. సమయానికి బిల్లులు ఇవ్వకపోగా, భారీగా
పెనాల్టీలు వేస్తుండటంతో ఆరోగ్యశ్రీ సేవలు అందించడం వృథా అన్న స్థితికి
ఆస్పత్రులు చేరుతున్నాయి. ట్రస్ట్ను పూర్తిగా బిజినెస్ మోడల్లోకి మార్చే
విధంగా అధికారులు సిద్ధం చేస్తున్న కొత్త ప్రతిపాదనలు కూడా నెట్వర్క్
ఆస్పత్రులకు వణుకు పుట్టిస్తున్నాయి. జిల్లాల్లో విధులు నిర్వహించే
ఆరోగ్యమిత్రాలు, టీమ్లీడర్లు, డిస్ట్రిక్ కో-ఆర్డినేటర్లకు జీతాలు
ట్రస్ట్ నుంచి చెల్లిస్తున్నారు. ఇకపై వారికి ఇచ్చే జీతాల్లో సగం ట్రస్ట్
నుంచి సగం నెట్వర్క్ ఆస్పత్రుల నుంచి చెల్లించే విధంగా ప్రతిపాదనలు
సిద్ధం చేస్తున్నారు. ఆరోగ్యమిత్రాలు నెట్వర్క్ ఆస్పత్రుల్లోనే విధులు
నిర్వహిస్తున్నారు. వారి సేవలు ఎక్కువగా ఆయా ఆస్పత్రులకు బిజినెస్
పెంచడానికే ఉపయోగిస్తున్నారు. కాబట్టి వారి జీతాల్లో కొంతమొత్తం సదరు
ఆస్పత్రులే ఇవ్వాలని నిర్ణయించారు. దీనికోసం ఆస్పత్రులకు ఇచ్చే బిల్లుల్లో
ఆడ్మినిస్ర్టేటివ్ ఖర్చుకింద 2శాతం కట్చేసి ఇవ్వాలని భావిస్తున్నారు. మరో
నెలలో ఈ ప్రతిపాదన అమలులోకి వచ్చే అవకాశాలున్నాయి. అయితే తమ బిల్లుల్లో
ఇప్పటికే 2శాతం ట్రస్ట్ కట్ చేస్తున్నట్లు కొన్ని ఆస్పత్రుల యాజమాన్యాలు
చెబుతున్నాయి.
సీపీఐకి సున్నం
కన్జ్యూమర్
ప్రైస్ ఇండెక్స్(సీపీఐ)కి అనుగుణంగా ఏటా ఆరోగ్యశ్రీ అమలుచేసే
ప్యాకేజీలను పెంచాల్సి ఉంటుంది. 2007-19వరకూ సీపీఐ 150శాతం పెరిగినట్లు
సమాచారం. కానీ ప్రభుత్వాలు 7.5శాతం మాత్రమే పెంచాయి. 2007-14 వరకూ సీపీఐ
నిబంధనల ప్రకారం ప్యాకేజీ 5శాతం పెరిగింది. గత ప్రభుత్వం ఒకేసారి 2.5శాతం
పెంచి 2017-18లో అమలు చేసింది. దాన్ని యథాతథంగా కొనసాగించాల్సిన కొత్త
ప్రభుత్వం పెరిగిన ప్యాకేజీ చెల్లించడం లేదని ఆస్పత్రుల యాజమాన్యాలు
ఆరోపిస్తున్నాయి. అలాగే 2018-19లో పెంచిన ప్యాకేజీ కూడా చెల్లించకుండా
ప్రభుత్వం కాలయాపన చేస్తోందంటున్నాయి. ఈ ఏడాది 2.5శాతం ప్యాకేజీకి
ప్రభుత్వం సున్నం కొట్టిందని, భవిష్యత్లో కూడా వస్తుందో, రాదో అని
అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతం ట్రస్ట్ అవలంబిస్తోన్న
విధానాలు, ప్రభుత్వం నిర్ణయాలతో నెట్వర్క్పై భారీగా భారం పడుతోంది.
దీనిపై చర్చించేందుకు సోమ, మంగళవారాల్లో అన్ని జిల్లాల్లో సమావేశాలు
నిర్వహించాలని ఆశా ప్రతినిధులు నిర్ణయించారు. తమ సమస్యలను ప్రభుత్వం
దృష్టికి తీసుకెళ్లడంతో పాటు భవిష్యత్ కార్యాచరణపై కూడా
0 Response to " అమ్మో.. ఆరోగ్యశ్రీ"
Post a Comment