ఇక 30 సెకన్లు మోగాల్సిందే: ట్రాయ్‌

దిల్లీ: ఇన్‌కమింగ్‌ కాల్‌ రింగ్‌ సమయం విషయంలో టెలికాం సంస్థల మధ్య నెలకొన్న వివాదానికి చెక్‌ పెడుతూ టెలికాం నియంత్రణ సంస్థ (ట్రాయ్‌) కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై మొబైల్‌ ఫోన్ల విషయంలో ఇన్‌కమింగ్‌ కాల్‌ రింగ్‌ టైమ్‌ను 30 సెకన్లుగా నిర్ణయించింది. ల్యాండ్‌లైన్‌ ఫోన్ల విషయంలో దీన్ని 60 సెకన్లుగా పేర్కొంది. ఇన్‌కమింగ్‌ కాల్‌ సమయాన్ని తగ్గించడం విషయంలో ఒక కంపెనీపై మరో కంపెనీ ఆరోపణలు చేసుకున్న నేపథ్యంలో ట్రాయ్‌ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శుక్రవారం టెలిఫోన్‌ సేవా నిబంధనలను సవరించింది. ఇప్పటి వరకు రింగ్‌ సమయం విషయంలో ఎలాంటి పరిమితీ లేకపోవడం గమనార్హం.



ఇటీవల జియో, ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియా కంపెనీలు సొంతంగా ఇన్‌కమింగ్‌ కాల్‌ సమయాన్ని వేటికవి తగ్గించాయి


ఇతర నెట్‌వర్క్‌ల నుంచి తమ నెట్‌వర్క్‌కు కాల్స్‌ తిరిగి చేయించేందుకు ఈ పద్ధతిని అనుసరించాయి. తొలుత ఇన్‌కమింగ్‌ కాల్‌ సమయాన్ని జియో 25 సెకన్లకు తగ్గించగా.. మిగిలిన రెండు కంపెనీలు సైతం అవే బాట పట్టాయి. ఫలితంగా ఇటీవల కాలంలో మిస్డ్‌కాల్స్‌ సంఖ్య పెరిగింది. ఎత్తేలోపే ఫోన్‌ కట్‌ అవ్వడంతో వినియోగదారులు సైతం ఇబ్బందులెదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో ట్రాయ్‌ తీసుకున్న తాజా నిర్ణయం వినియోగదారులకు ఊరటనే చెప్పాలి

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "ఇక 30 సెకన్లు మోగాల్సిందే: ట్రాయ్‌"

Post a Comment