మీరూ కరెంట్ అమ్మొచ్చు!
సోలార్ రూఫ్ టాప్ ప్యానెల్ ఏర్పాటుతో విద్యుత్ కష్టాలకు చెక్
ఇంటికి సరిపడా ఉపయోగించుకుని మిగిలిన విద్యుత్ విక్రయం
యూనిట్ రూ.5.58 చొప్పున గ్రిడ్కు అమ్ముకునే అవకాశం
ఒక్క కృష్ణా జిల్లాలోనే ఏటా రూ.43 లక్షలు ఆర్జిస్తున్న వినియోగదారులు
రూ.60 వేలు ఖర్చయ్యే ఈ పథకానికి రూ.50 వేలు రాయితీ
సోలార్ రూఫ్ టాప్ వినియోగదారులు ఉత్పత్తయిన సోలార్ విద్యుత్ను వినియోగించుకోగా మిగిలిన విద్యుత్ను గ్రిడ్కు తిరిగి అమ్ముకునే వెసులుబాటు ఉంది. ఇలా ఒక్కో సోలార్ విద్యుత్ యూనిట్కు రూ.5.58 చొప్పున వినియోగదారుడికి
అమర్చారు. కాగా, కృష్ణా జిల్లా వ్యాప్తంగా మొత్తం సోలార్ రూఫ్ టాప్ కనెక్షన్ల నుంచి 134.5 కిలోవాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. ఇందులో నెలకు 64,500 యూనిట్ల సోలార్ విద్యుత్ను విక్రయిస్తున్నారు. యూనిట్కు రూ.5.58 చొప్పున పవర్ గ్రిడ్ వీరి నుంచి కొనుగోలు చేస్తోంది. ఇలా ఏడాదికి విద్యుత్ అమ్మకం ద్వారా వీరు రూ.43 లక్షలు ఆర్జిస్తున్నారు. మరోవైపు.. సోలార్ విద్యుత్ వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ఏపీఎస్పీడీసీఎల్ అధికారులు అవగాహనా కార్యక్రమాలు చేపడుతున్నారు. స్కూలు, కాలేజీ విద్యార్థులతో ర్యాలీలు, వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించి బహుమతులిస్తున్నారు.
‘సూర్యశక్తి’ ఇలా..
- రూఫ్పై 100 (10 గీ 10) చదరపు అడుగుల స్థలం ఉంటే చాలు.
- మీటర్ తమ పేరుపై ఉన్న వారెవరైనా నెడ్క్యాప్, ఏపీఎస్పీడీసీఎల్లకు దరఖాస్తు చేసుకోవచ్చు.
- ప్యానెల్స్ నిర్వహణకు ప్రత్యేక సంస్థలున్నాయి. సర్వీస్ కోసం తక్కువ ఖర్చుతో సేవలందుతాయి.
- ఆకాశం పూర్తిగా మేఘావృతమై ఉన్నప్పుడు, వర్షం
కురిసేటప్పుడు విద్యుత్ ఉత్పత్తి సాధ్యం కాదు. మిగతా సమయాల్లో నిరాటంకంగా
విద్యుత్ ఉత్పత్తి అవుతుంది.
- ఈ పథకం కింద ఒక కిలోవాట్ సామర్థ్యం ఉన్న యూనిట్ అమరుస్తారు.
- యూనిట్ ఏర్పాటు చేసేందుకు రూ.60 వేలు ఖర్చవుతుంది.
అయితే ఇందులో రూ.50 వేలు రాయితీ ఉంటుంది. వినియోగదారుడు భరించాల్సింది
కేవలం రూ.10 వేలు
0 Response to " మీరూ కరెంట్ అమ్మొచ్చు!"
Post a Comment