దూసుకెళ్తున్న బ్యాంకింగేతర పేమెంట్స్‌

ముంబయి: ఏదైనా ఆర్థిక లావాదేవీలు, చెల్లింపులు చేయాలంటే తప్పకుండా బ్యాంకులకు వెళ్లాలి. ఇది ఒకప్పటి పరిస్థితి. అందుబాటులోకి వచ్చిన ఆధునిక సాంకేతికత, రోజురోజుకీ పుట్టుకొస్తున్న డిజిటల్ పేమెంట్స్‌ యాప్స్‌ ద్వారా బ్యాంకులకు వెళ్లాల్సిన అవసరం లేకుండా కూర్చున్న చోటు నుంచే వివిధ రకాల చెల్లింపులు జరుపుతున్నాం. ఈ నేపథ్యంలో చెల్లింపుల ద్వారా దేశంలోని బ్యాంకులు ఆర్జించే ఆదాయం 2025 నాటికి 14 శాతం (9 బిలియన్‌ డాలర్లు) మేర తగ్గే అవకాశాలున్నట్లు 'బ్యాంకింగ్‌ పల్స్‌' పేరుతో యాక్సెంచర్‌ సంస్థ 


నిర్వహించిన సర్వేలో తేలింది. ఈ నేపథ్యంలో డిజిటల్‌ పేమెంట్స్‌ యాప్‌లు, బ్యాంకింగేతర సంస్థలకు ధీటుగా బ్యాంకింగ్‌ వ్యవస్థలో సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందని యాక్సెంచర్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ (ఇండియా) మేనేజింగ్‌ డైరెక్టర్‌ రిషి అరోరా అభిప్రాయం వ్యక్తం చేశారు

బ్యాంకింగేతర మార్గాల (ఈ-వ్యాలెట్స్‌, పేమెంట్స్‌ యాప్స్‌, సంస్థలు) ద్వారా చేసే చెల్లింపుల వల్ల సమకూరే ఆదాయం ఏటా 10.7 శాతం చొప్పున వృద్ధి చెందుతుందని సర్వేలో వెల్లడైంది. ఇది ఇలాగే కొనసాగితే ప్రస్తుతం (2019) దేశంలో బ్యాంకింగేతర పేమెంట్స్‌ ద్వారా సమకూరే 38 బిలియన్‌ డాలర్ల ఆదాయం 2025 నాటికి 70 బిలియన్‌ డాలర్లకు చేరుకునే అవకాశాలున్నట్లు అధ్యయనంలో తేలింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ చెల్లింపులు 2 ట్రిలియన్‌ డాలర్లకు చేరుతాయని సర్వేలో వెల్లడైంది.
అందుబాటులో ఉన్న అత్యాధునిక సాంకేతికతను బ్యాంకులు అందిపుచ్చుకున్నట్లయితే 2025 నాటికి 32 బిలియన్‌ డాలర్ల మేర ఆదాయం పెంచుకునేందుకు అవకాశం ఉన్నట్లు అధ్యయనంలో తేలింది. డిజిటల్‌ పేమెంట్స్‌ యాప్స్‌ అయిన గూగుల్‌ పే, పేటీఎం, ఫోన్‌ పే లాంటివి భారత్‌లో పెద్ద ఎత్తున ప్రాచుర్యంలోకి వచ్చాయి. పెద్ద నోట్ల రద్దు తర్వాత ఈ యాప్‌ల వినియోగం మరింత 

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "దూసుకెళ్తున్న బ్యాంకింగేతర పేమెంట్స్‌"

Post a Comment