ఏపీ వాహనదారులకు గుడ్ న్యూస్... డ్రైవింగ్ లైసెన్స్ జారీ విధానంలో మార్పులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం డ్రైవింగ్ లైసెన్స్ పొందాలంటే వాహనాన్ని మోటర్ వెహికల్ ఇన్స్ పెక్టర్, అసిస్టెంట్ మోటర్ వెహికల్ ఇన్స్ పెక్టర్ ఆధ్వర్యంలో నడపాలి. కానీ చాలామంది ఈ డ్రైవింగ్ టెస్ట్ లో పాస్ కానప్పటికీ అక్రమంగా డ్రైవింగ్ లైసెన్స్ పొందుతున్నారు. డ్రైవింగ్ లైసెన్స్ జారీలో అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణలు చాలాకాలం నుండి ఉన్నాయి. కొందరు మధ్యవర్తులు వాహనదారులకు అక్రమంగా లైసెన్స్ పొందటంతో సహాయం చేస్తున్నారు.
కానీ మరికొన్ని నెలల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లైసెన్స్ జారీ ప్రక్రియ పూర్తిగా మారబోతుంది. సెన్సార్లు, కెమెరాలు అమర్చబడి ఉన్న నూతన డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్ లను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది
ప్రభుత్వం అర్హులైన వారికి మాత్రమే డ్రైవింగ్ లైసెన్స్ దక్కాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలను తగ్గించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ నూతన విధానానికి శ్రీకారం చుట్టింది. వీడియో రికార్డు ద్వారా డ్రైవింగ్ టెస్ట్ రికార్డ్ చేస్తూ ఉండటంతో అక్రమాలకు అవకాశం ఉండదు. ప్రభుత్వం రాష్ట్రంలోని 8 ప్రధాన నగరాల్లో సైంటిఫిక్ డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్ లను ఏర్పాటు చేయనుంది.
భవిష్యత్తులో మరిన్ని నగరాల్లో సైంటిఫిక్ డ్రైవింగ్ టెస్ట్ ట్రాకులు ఏర్పాటు అయ్యే అవకాశం ఉంది. ఈ ట్రాక్ ల నిర్మాణం కొరకు కేంద్రం రాష్ట్రానికి 9 కోట్ల రూపాయల సాయం చేస్తోంది. ఏపీలోని అనంతపూర్, కర్నూల్, తిరుపతి, నెల్లూరు, ఏలూరు, గుంటూరు, విజయవాడ, విశాఖపట్టణం నగరాల్లో సైంటిఫిక్ డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్ లు ఏర్పాటు చేయబోతున్నారు. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో ఈ విధానం అమలవుతోంది. ధరఖాస్తుదారులు కోరితే అధికారులు రికార్డయిన వీడియో ఫుటేజ్ ను కూడా చూపిస్తారని తెలుస్తోంది
0 Response to "ఏపీ వాహనదారులకు గుడ్ న్యూస్... డ్రైవింగ్ లైసెన్స్ జారీ విధానంలో మార్పులు "
Post a Comment