నిరక్షరాస్యతను సున్నా చేయడమే లక్ష్యం:జగన్‌

విజయవాడ: భారత మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్‌ జీవితం తరతరాలకు బాటలు చూపే పాఠమని ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఐదేళ్లలో వందశాతం అక్షరాస్యతే లక్ష్యమని ప్రకటించారు. 



రాష్ట్రంలో నిరక్షరాస్యత శాతం జాతీయ స్థాయితో పోలిస్తే ఎక్కువగా ఉందని, ఆ పరిస్థితిని ఐదేళ్లలో మారుస్తామని సీఎం స్పష్టం చేశారు. విజయవాడలో ప్రభుత్వం నిర్వహించిన గురుపూజోత్సవంలో సీఎం పాల్గొన్నారు. ఉత్తమ ఉపాధ్యాయులను సత్కరించారు. రాష్ట్రంలో నిరక్షరాస్యత శాతం సున్నా చేయాలన్నదే తన లక్ష్యమని చెప్పారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా విజయవాడలో నిర్వహించిన గురుపూజోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సీఎం హాజరయ్యారు


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బ్రిక్స్‌ ఎకానమీ గణాంకాల ప్రకారం కళాశాలకు వెళ్తున్న విద్యార్థులు మనదేశంలో కేవలం 36 శాతం మాత్రమే ఉన్నారని తెలిపారు. కళాశాలకు వెళ్లే విద్యార్థుల సంఖ్య పెంచేందుకు పూర్తిగా బోధనా రుసుములు చెల్లిస్తున్నామన్నారు. పాఠశాలలు పరిస్థితి గురించి గత ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు.

పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించలేదని అన్నారు. మధ్యాహ్న భోజన పథకానికి నెలల తరబడి నిధులు ఇవ్వలేదని, ప్రభుత్వమే పాఠశాలలను నిర్వీర్యం చేసిందని పాదయాత్రలో తెలుసుకున్నానని చెప్పారు. విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలని ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు


Additional information

సాక్షి, విజయవాడ : ‘‘గురువులందరికీ వందనాలు. నాకు చదువు నేర్పిన గురువులకు పాదాభివందనాలు’’ అని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి
వ్యాఖ్యానించారు. గురువారం విజయవాడలోని మున్సిపల్‌ ఎంప్లాయీస్‌ కాలనీలోని ఏ ప్లస్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో జరిగిన గురుపూజోత్సవంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధ్యాపకుడిగా జీవితాన్ని ప్రారంభించి.. రాష్ట్రపతిగా ఎదిగిన డా. సర్వేపల్లి రాధాకృష్ణ అందరికీ ఆదర్శమని కొనియాడారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి గురువుల పట్ల ఎంతో భక్తిశ్రద్ధలు చూపించారని అన్నారు. గురువు వెంకటప్పయ్య పేరుతో వైఎస్సార్‌ పులివెందులలో స్కూల్‌ను స్థాపించారని తెలిపారు. వైఎస్సార్‌ ఫౌండేషన్ ఇప్పటికీ ఆ స్కూలును నడుపుతోందని అన్నారు. గురువు విద్యార్థుల గుండెలపై ముద్ర వేయగలరు అనేందుకు ఇదే  నిదర్శనమన్నారు. గురువు చేసిన పని ఎవరూ చేయలేరన్నారు

రాష్ట్రంలో నిరక్షరాస్యత శాతం సున్నా చేయాలన్నది తన లక్ష్యంగా సీఎం జగన్‌ పేర్కొన్నారు. బ్రిక్స్‌ ఎకానమీ లెక్కల ప్రకారం కాలేజీలకు వెళుతున్న విద్యార్థులు మన దేశంలో కేవలం 36 శాతమేనని వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలల్లో గణనీయమైన మార్పుకు కట్టుబడి ఉన్నామన్నారు. దీనిలో తల్లిదండ్రులను భాగస్వామ్యం చేస్తున్నామని తెలిపారు. ప్రతి స్కూల్లో మార్పులు తెస్తామని, ప్రతి స్కూల్‌ను ఇంగ్లీషు మీడియం చేయాలని తాపత్రయపడుతున్నానన్నారు. ప్రతి విద్యార్థి గవర్నమెంట్ స్కూల్‌కు రావాలనే విధంగా విద్యావ్యవస్థను తీర్చిదిద్దుతామని చెప్పారు. అనంతరం రాష్ట్రంలో ఉత్తమ సేవలందించిన గురువులకు ఆయన అవార్డులు అందజేశారు


SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "నిరక్షరాస్యతను సున్నా చేయడమే లక్ష్యం:జగన్‌"

Post a Comment