నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ
* తొలిరోజు 12.54 లక్షల మంది హాజరు
* 1.26 లక్షల పోస్టులకు 21.68 లక్షల మంది పోటీ
ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి:
రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, పట్టణాల్లో వార్డు సచివాలయాల ఉద్యోగాల భర్తీకి ఆదివారం నుంచి వచ్చే ఆదివారం వరకూ రాత పరీక్షలు జరగను న్నాయి. 1.26 లక్షల ఉద్యోగాల భర్తీకి నిర్వహించే ఈ పరీక్షలకు 21,69,814 మంది హాజరు కానున్నారు. మొత్తం 36,449 కార్యదర్శుల పోస్టులకు 12,54,071 మంది అభ్యర్థులు పోటీ పడుతు న్నారు. సెప్టెంబరు ఒకటో తేదీన వీరికి రాత పరీక్ష ఉంటుంది. పంచాయతీ కార్యదర్శి, వార్డు ప్రణాళిక కార్యదర్శి, విద్యా డేటా ప్రాసెసింగ్ కార్యదర్శి పోస్టులకు ఎక్కువమంది పోటీపడటం, సెప్టెంబరు ఒకటో తేదీ ఆదివారం తొలిరోజు 12.54 లక్షల మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరు కానునుం డడంతో అధికారులు పెద్దఎత్తున ఏర్పాట్లు చేశారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి భోజనం, తాత్కాలిక వసతి ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది
నిబంధనలు
* అభ్యర్థులు తప్పనిసరిగా ఏదో ఒక గుర్తింపు కార్డు తెచ్చుకోవాలి.
* ఆధార్, పాన్, ఓటరు గుర్తింపు కార్డు, డ్రైవింగ్ లైసెన్సు ఉన్నా చాలు.
* హాల్ టికెట్పై అభ్యర్థి ఫొటో స్పష్టంగా కనిపించకపోతే గజిటెడ్ అధికారి నిర్థారించిన మూడు పాస్పోర్టు సైజ్ ఫొటోలను తీసుకురావాలి.
* బ్లాక్ లేదా బ్లూ బాల్ పాయింట్ పెన్నులను మాత్రమే ఒఎంఆర్ షీట్పై బబ్లింగ్కు వినియోగించాలి
* అభ్యర్థులు సిరీస్ కోడ్తోపాటు ఇన్విజిలేటర్ సంతకం పెట్టించుకోవాలి.
* పరీక్ష హాల్లోకి అరగంట ముందుగా హాజరు కావాలి.
* ఉదయం పది గంటల తర్వాత, మధ్యాహ్నం 2.30 గంటల తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరు.
* నిమిషం ఆలస్యమైనా అంగీకరించరు.
* పరీక్ష పూర్తవకుండా నిమిషం ముందు కూడా బయటకు పంపరు.
* పరీక్ష ముగిసేలోగా బయటకు వెళ్లిన వారి ప్రశ్న, జవాబు పత్రాలు పరిగణనలోకి తీసుకోరు.
* మొబైల్ ఫోన్స్, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువుల్ని అంగీకరించరు.
* అభ్యర్థులు పరీక్ష హాల్లో దుశ్చర్యలకు పాల్పడకూడదు.
* పరీక్ష ముగిసిన తర్వాత అభ్యర్థులు వారితోపాటు ప్రశ్నాపత్రం, ఒఎంఆర్ షీటు నకలు కాపీ తీసుకెళ్లవచ్చు.
* ఒరిజనల్ ఒఎంఆర్ షీట్ తీసుకెళ్లకూడదు. తీసుకెళ్లిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటారు
0 Response to "నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ"
Post a Comment