ప్రభుత్వం చేతికి ప్రత్యక్ష పన్ను కోడ్‌ నివేదిక

న్యూఢిల్లీ: ప్రస్తుతం అమల్లో ఉన్న ఆదాయ పన్ను చట్టం స్థానంలో నూతన ప్రత్యక్ష పన్ను చట్టం తీసుకురావడానికి సంబంధించిన నివేదిక ప్రభుత్వం చేతికి అందింది. కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) సభ్యుడు అఖిలేష్‌ రంజన్‌ 



సారథ్యంలోని నిపుణుల కమిటీ సోమవారంనాడు ఈ నివేదికను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు సమర్పించింది. గత నవంబరులో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ నివేదిక కోసం టాస్క్‌ ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. దీనికి రంజన్‌ కన్వీనర్‌గా ఉండగా.. చార్టర్డ్‌ అకౌంటెంట్‌ గిరీష్‌ అహుజా, ఈవై చైర్మన్‌, రీజినల్‌ మేనేజింగ్‌ పార్ట్‌నర్‌ రాజీవ్‌ మెమానీ, ప్రాక్టీసింగ్‌ టాక్స్‌ అడ్వకేట్‌ ముకేష్‌ పటేల్‌, ఐసీఆర్‌ఐఈఆర్‌ కన్సల్టెంట్‌ మన్సీ కేడియా, రిటైర్డ్‌ ఐఆర్‌ఎస్‌ అధికారి జీసీ శ్రీవాత్సవ సభ్యులుగా ఉన్నారు

వాస్తవానికి ఈ టాస్క్‌ఫోర్స్‌ ఈ ఏడాది మే 31 వరకు తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంది. కానీ సాధ్యం కాకపోవడంతో నివేదికను సమర్పించేందుకు అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ మరో రెండు నెలల గడువు ఇచ్చారు. ఆగస్టు 16 వరకు నివేదిక సమర్పించాల్సి ఉన్నా.. మళ్లీ గడువు కోరారు. తాజాగా సోమవారంనాడు ఈ నివేదికను ఆర్థిక మంత్రికి సమర్పించారు

Additional information

  • ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అభయం
న్యూఢిల్లీ: కార్పొరేట్‌ ట్యాక్స్‌ను దశలవారీగా తగ్గిస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అభయం ఇచ్చారు. రూ.400 కోట్ల టర్నోవర్‌ వరకూ ఉన్న కంపెనీలపై కార్పొరేట్‌ ట్యాక్స్‌ను దశలవారీగా 25 శాతానికి తగ్గిస్తామని పేర్కొన్నారు. సంపద సృష్టించేవాళ్లకు తగిన తోడ్పాటునందిస్తామని పేర్కొన్నారు. సంపద సృష్టించేవారికి తగిన తోడ్పాటు నందిస్తామన్న ప్రధాని స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగానికి ప్రతిధ్వనిగా ఆమె మరోమారు ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఇక్కడ జరిగిన ఒక పారిశ్రామిక సమావేశంలో ఆమె మాట్లాడారు. ఇతర కంపెనీలపై కార్పొరేట్‌ ట్యాక్స్‌ను కూడా దశలవారీగా తగ్గిస్తామని పేర్కొన్నారు

అయితే తగ్గింపునకు సంబంధించిన నిర్దిష్ట గడువును ఆమె వెల్లడించలేదు. ప్రధాని నరేంద్ర మోదీ తన వార్షిక స్వాతంత్య్ర దినోత్సవ ఉపన్యాసం సందర్భంగా సంపద సృష్టించే వారి పాత్రను కొనియాడారు. వారిని అనుమానాస్పదంగా చూడొద్దని చెప్పారు. సంపద సృష్టి జరిగితేనే, దానిని పంపిణీ చేయడం సాధ్యపడుతుందని పేర్కొన్నారు. సంపద సృష్టించడం అత్యవసరమని, సంపద సృష్టించేవారే భారత సంపద అని, వారిని గౌరవిస్తామని తన ప్రసంగంలో ప్రధాని ఉద్ఘాటించారు. పెద్ద సంస్థలకూ క్రమంగా 25 శాతానికి కార్పొరేట్ ట్యాక్స్‌ 
సుమారు రూ. 400 కోట్ల పైగా టర్నోవరు ఉండే కంపెనీలపై కార్పొరేట్ ట్యాక్స్‌ రేటును క్రమంగా 25 శాతానికి తగ్గిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. సంపద సృష్టికర్తలకు ప్రభుత్వం అన్ని విధాలా తోడ్పాటు అందిస్తుందని ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆమె తెలిపారు. జీవనాన్ని మరింత సులభతరం చేసే ఉద్దేశంతోనే ప్రతీ విధానం, ప్రతీ పథకాన్ని తీర్చిదిద్దుతున్నట్లు మంత్రి వివరించారు. "ప్రస్తుతం కేవలం 0.7 శాతం సంస్థలే గరిష్ట కార్పొరేట్ ట్యాక్స్ రేటు పరిధిలో ఉన్నాయి. దీర్ఘకాలంలో వీటికి కూడా ట్యాక్స్ రేటును 25 శాతం పరిధిలోకి తెస్తాము" అని ఆమె చెప్పారు. అయితే, ఎప్పటిలోగా ఇది అమలు చేసేదీ మాత్రం స్పష్టమైన గడువేదీ మంత్రి పేర్కొనలేదు. గత నెలలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో రూ. 400 కోట్ల దాకా వార్షిక టర్నోవరు ఉన్న సంస్థలకు కార్పొరేట్ ట్యాక్స్ రేటును 30 శాతం నుంచి 25 శాతానికి కేంద్రం తగ్గించిన సంగతి తెలిసిందే. కొత్త పన్నుల చట్టంపై కేంద్రానికి నివేదిక 
ఆదాయపు పన్ను చట్టం స్థానంలో కొత్తగా ప్రవేశపెట్టదల్చుకున్న ప్రత్యక్ష పన్నుల స్మృతి (డీటీసీ)పై నివేదికను ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ సోమవారం కేంద్రానికి సమర్పించింది. "టాస్క్‌ఫోర్స్ కన్వీనర్‌ అఖిలేష్ రంజన్ సోమవారం కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు అందజేశారు" అని మైక్రోబ్లాగింగ్ సైటు ట్విటర్‌లో ఆర్థిక శాఖ ట్వీట్ చేసింది. అయితే, నివేదిక వివరాలేవీ వెల్లడి కాలేదు. ఎప్పుడో యాభై ఏళ్ల క్రితం రూపొందిన ఆదాయపు పన్ను చట్టానికి కాలం చెల్లిందని, దాన్ని ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా సవరించాల్సిన అవసరం ఉందని 2017 సెప్టెంబర్‌లో ఆదాయపు పన్ను శాఖ అధికారుల వార్షిక సదస్సులో పాల్గొన్న సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. దీంతో దేశ ఆర్థిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కొత్త ప్రత్యక్ష పన్నుల స్మృతిని రూపొందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేసింది. మిగతా దేశాల్లో అనుసరిస్తున్న విధానాలు కూడా అధ్యయనం చేసి అంతర్జాతీయంగా ఉత్తమ ప్రమాణాలతో దీన్ని తయారు చేయాలని ప్రభుత్వం సూచించింది. 
ఇది వాస్తవానికి ఆరు నెలల వ్యవధిలో 2018 మే 22 నాటికి నివేదిక సమర్పించాల్సి ఉన్నప్పటికీ.. ఆగస్టు 22 దాకా కేంద్రం గడువు పొడిగించింది. కన్వీనర్‌ అరబింద్ మోదీ 2018 సెప్టెంబర్‌ 30న పదవీ విరమణ చేయడంతో ఈ ఏడాది ఫిబ్రవరి 28 నాటికల్లా నివేదికను సమర్పించే బాధ్యతను అఖిలేష్ రంజన్ సారథ్యంలోని కమిటీకి అప్పగించింది. కమిటీలో కొత్త సబ్యులు మరింత సమయం కోరడంతో దీన్ని ఆ తర్వాత మే 31కి, అటు పైన ఆగస్టు 16 నాటికి పొడిగించింది. గిరీష్ అహూజా (సీఏ), రాజీవ్ మెమానీ (ఈవై రీజనల్ మేనేజింగ్ పార్ట్‌నర్‌, చైర్మన్) తదితరులు ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "ప్రభుత్వం చేతికి ప్రత్యక్ష పన్ను కోడ్‌ నివేదిక"

Post a Comment