కొత్త ఉపాధ్యాయులకు తీపి కబురు

● డీఎస్సీ నియామక ప్రక్రియ ప్రారంభం

● మొదట 52 స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీ

ఒంగోలు విద్య, న్యూస్‌టుడే: ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న అభ్యర్థులకు తీపి కబురు అందింది. ఎట్టకేలకు ఉపాధ్యాయ నియామకాల ప్రక్రియ మొదలైంది. గత ఏడాది నిర్వహించిన డీఎస్సీ-2018 నియామక ప్రక్రియకు ప్రభుత్వం ఏర్పాట్లు చేపట్టింది. ఖాళీల భర్తీకి అర్హులైన వారి జాబితాలను సిద్ధం చేసి డీఈవో కార్యాలయానికి పంపించేందుకు విద్యాశాఖ కమిషనరేట్‌ చర్యలు తీసుకుంటోంది. జిల్లాలోని 285 పోస్టుల్లో మొదట స్కూల్‌ అసిస్టెంట్ల ఖాళీలను భర్తీ చేస్తారు. ఆంగ్లం-4, గణితం-6, బీఎస్‌-14, సాంఘిక శాస్త్రం-28 పోస్టులు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి



మొత్తం 52 ఖాళీలకు గాను పాఠశాల విద్యాశాఖ ధ్రువీకరించిన జాబితా ఈ నెల 19న జిల్లా విద్యాశాఖాధికారులకు అందనుంది. ఆ జాబితాను ఈ నెల 20వ తేదీ డీఈవో కార్యాలయం నోటీసు బోర్డులో అందుబాటులో ఉంచుతారు. దీని ప్రకారం అభ్యర్థులు తమ ధ్రువీకరణ పత్రాలను 20, 21 తేదీల్లో విద్యాశాఖ వెబ్‌సైట్‌కు అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. అనంతరం ఎంపిక కమిటీ ఆన్‌లైన్‌లో ధ్రువీకరణ పత్రాలను పరిశీలిస్తుంది.

అభ్యర్థులు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేసిన అసలు పత్రాలను మాత్రమే జిల్లా అధికారుల పరిశీలన సమయంలో చూపించాల్సి ఉంటుంది. ఈ పక్రియ అంతా పూర్తయిన తర్వాత ఆగస్టు ఒకటో తేదీన తుది జాబితాను సిద్ధం చేస్తారు. 2, 3 తేదీల్లో జిల్లాలో అందుబాటులో ఉన్న స్థానాల కోసం అభ్యర్థులు వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకోవచ్ఛు కలెక్టర్‌ ఆమోదంతో అయిదో తేదీన నియామక ఉత్తర్వులు అందజేస్తారు. ఎస్జీటీల ఎంపిక ప్రక్రియ ఆగస్టు రెండో తేదీ నుంచి ప్రారంభం అవుతుంది

SUBSCRIBE TO OUR NEWSLETTER

1 Response to "కొత్త ఉపాధ్యాయులకు తీపి కబురు"