పాఠశాల ఎగ్గొడితే వివరాలివ్వాల్సిందే
పాఠశాల ఎగ్గొడితే వివరాలివ్వాల్సిందే!
ఫిబ్రవరి 7లోపు తుది అనుమతులు
కఠినంగా వ్యవహరించనున్న సీబీఎస్ఈ
దిల్లీ: ఏదో వంకతో పాఠశాలకు బంక్ కొడుతున్న విద్యార్థులను, చూసీచూడనట్లు వ్యవహరిస్తున్న పాఠశాలల యాజమాన్యాలను ఇకపై సహించబోమని సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) హెచ్చరిస్తోంది. నిర్ణీత హాజరు కంటే తక్కువ ఉన్న అందరు విద్యార్థుల వివరాలను, కారణాలను.. సంబంధిత ధ్రువీకరణపత్రాలను ఇకపై తప్పనిసరిగా సీబీఎస్ఈకి సమర్పించాల్సిందేనని ఓ సీనియర్ అధికారి చెప్పారు. నిబంధనలను అనుసరించి ఫిబ్రవరి 7లోపు బోర్డు వీటిపై తుది నిర్ణయం
తీసుకుంటుందన్నారురు. హాజరు తక్కువగా ఉన్న సీబీఎస్ఈ పది, 12వ తరగతి విద్యార్థులు 2019 పరీక్ష ఫలితాల్లో.. మిగిలినవారితో పోలిస్తే పెద్దగా రాణించలేకపోయినట్లు బోర్డు అధికారులు గుర్తించారు. అటెండెన్స్ తక్కువగా ఉన్నా పరీక్షలు రాసేవారి కోసం తాజాగా ‘‘ప్రత్యేకమైన ప్రామాణిక పద్ధతులు’’ రూపొందించారు. ఇకపై విద్యార్థులు, తల్లిదండ్రులు, పాఠశాలల యాజమాన్యాలు ఈ నిర్ణీత ప్రమాణాల ప్రకారం బోర్డుకు వివరాలను జనవరి 7లోపు ప్రాంతీయ కార్యాలయాలకు పంపించాలి. మరిన్ని వివరాలు కావాల్సి ఉంటే, అధికారులు అడిగితే సమర్పించాలి. జనవరి 1 వరకు వివరాలను జనవరి 7లోపు పాఠశాలలు పంపించాల్సి ఉంటుంది. దీర్ఘకాలిక అనారోగ్యం, తల్లి లేదా తండ్రి చనిపోయినా, ఇలాంటి ఇతర కారణాలు, జాతీయ- అంతర్జాతీయ క్రీడల్లో పాల్గొనే విద్యార్థులకు ప్రస్తుతం హాజరు తక్కువగా ఉన్నా పరీక్షలకు అనుమతిస్తున్నారు. సంబంధిత అన్ని కేసుల వివరాలను, నిర్ణీత ధ్రువీకరణ పత్రాలతో పాఠశాలలు బోర్డుకు పంపించడం లేదు. ఇకపై వీటిని కఠినంగా అమలు చేయనున్నారు
0 Response to "పాఠశాల ఎగ్గొడితే వివరాలివ్వాల్సిందే"
Post a Comment