ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి
గోరంట్ల(గుంటూరు), న్యూస్టుడే: రాష్ట్రం, జిల్లాలో ఆయా ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య (ఏపీజీఈఎఫ్) కృషి చేస్తుందని ఆ సంఘ రాష్ట్ర కోశాధికారి అంబటి వెంకటస్వామి పేర్కొన్నారు. సంఘ జిల్లా శాఖ తొలి కార్యవర్గ సర్వసభ్య సమావేశాన్ని అమరావతి రోడ్డు గోరంట్లలోని విజయదుర్గ ఎస్టేట్లో ఆదివారం నిర్వహించారు. సంఘ జిల్లా ఛైర్మన్ మొహమ్మద్ హనీఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశంలో తొలుత జిల్లాలోని అన్ని శాఖల ఉద్యోగుల సమస్యలు, సంఘం బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలు, సంఘం తరఫున జిల్లా అధికారులను కలిసే ఏర్పాటుపై ప్రణాళిక, సభ్యత్వ నమోదు తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు
ముఖ్యఅతిథిగా పాల్గొన్న వెంకటస్వామి మాట్లాడుతూ జీవో నంబరు 14, 15 ద్వారా భాషా పండిట్లకు పదోన్నతులు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. సీపీఎస్ సమస్యపై కమిటీని వేసి, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సీపీఎస్ విధానాన్ని ప్రభుత్వం రద్దు చేయాలని కోరారు. గ్రామ పంచాయతీల్లో పని చేస్తున్న తాత్కాలిక ఉద్యోగులు, డిజిటల్ ఆపరేటర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. జిల్లా ప్రధాన కార్యదర్శి గుర్రం మురళీమోహన్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీల్లో పని చేస్తున్న కార్యదర్శులకు పదోన్నతులు కల్పించాలన్నారు.
అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగులకు దిశానిర్దేశం చేసే వ్యవస్థను ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. సంఘం జిల్లా ఛైర్మన్ హనీఫ్ మాట్లాడుతూ ఎయిడెడ్, మున్సిపాలిటీ ఉపాధ్యాయులకు వెంటనే ఆరోగ్య కార్డులు మంజూరు చేయాలన్నారు. 1987 నుంచి 2009 మధ్య పని చేసిన కాలానికి వృత్తి విద్యా ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానం అమలు చేయాలన్నారు. స్టాఫ్నర్సులకు పదోన్నతులు కల్పించాలన్నారు. కార్యక్రమంలో గ్రామ పంచాయతీల రాష్ట్ర అధ్యక్షుడు ఎం.వెంకటరెడ్డి, గ్రంథాలయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కోనా దేవదాస్, సంఘ కో-ఛైర్మన్ ప్రసన్నకుమార్, ఉమ్మడి రాష్ట్ర ఉద్యోగ సంఘాల నాయకుడు రోమాల్నాయుడు, మేడ్ జిల్లా అధ్యక్షుడు మేకల వీరయ్య, వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు ఝాన్సీరాణి, గురువారెడ్డి, డి.విష్ణువర్ధన్, చలపతి, కె.శ్రీనివాసరెడ్డి, మురళి తదితరులు పాల్గొన్నారు
అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగులకు దిశానిర్దేశం చేసే వ్యవస్థను ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. సంఘం జిల్లా ఛైర్మన్ హనీఫ్ మాట్లాడుతూ ఎయిడెడ్, మున్సిపాలిటీ ఉపాధ్యాయులకు వెంటనే ఆరోగ్య కార్డులు మంజూరు చేయాలన్నారు. 1987 నుంచి 2009 మధ్య పని చేసిన కాలానికి వృత్తి విద్యా ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానం అమలు చేయాలన్నారు. స్టాఫ్నర్సులకు పదోన్నతులు కల్పించాలన్నారు. కార్యక్రమంలో గ్రామ పంచాయతీల రాష్ట్ర అధ్యక్షుడు ఎం.వెంకటరెడ్డి, గ్రంథాలయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కోనా దేవదాస్, సంఘ కో-ఛైర్మన్ ప్రసన్నకుమార్, ఉమ్మడి రాష్ట్ర ఉద్యోగ సంఘాల నాయకుడు రోమాల్నాయుడు, మేడ్ జిల్లా అధ్యక్షుడు మేకల వీరయ్య, వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు ఝాన్సీరాణి, గురువారెడ్డి, డి.విష్ణువర్ధన్, చలపతి, కె.శ్రీనివాసరెడ్డి, మురళి తదితరులు పాల్గొన్నారు
0 Response to "ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి"
Post a Comment