‘పది’ పరీక్షల్లో* *సంస్కరణలు

*✨ ‘పది’ పరీక్షల్లో*
 *సంస్కరణలు.*

★ పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల్లో సమూల మార్పులను తెచ్చేందుకు పలు ప్రతిపాదనలు ప్రభుత్వ పరి శీలనలో ఉన్నాయని పాఠశాల విద్యాశాఖ ప్రాం తీయ సంయుక్త సంచాలకులు (కాకినాడ ఆర్జేడీ), ఏపీ ఓపెన్‌ స్కూల్స్‌ డైరెక్టర్‌ ఆర్‌.నర సింహారావు వెల్లడి. 

★ సబ్జెక్టుకు రెండు పేపర్ల స్థానే 100 మార్కులకు ఒక సబ్జెక్టుకు ఒకే పరీక్షను నిర్వహించాలని ప్రభుత్వానికి ప్రతి పాదించామని, 
★ ఆ మేరకు నూతన పరీక్షా విధానం వచ్చే ఏడాది నుంచి అమలయ్యే అవకాశాలున్నాయన్నాయని వెల్లడి. 

★ పది పరీక్షల్లో అమలవుతోన్న రెండు పేపర్ల పద్ధతి వల్ల పరీక్షల నిర్వహణ, మూల్యాంకన వ్యవధితో పాటు, నిధులు అధికంగా వెచ్చించాల్సి వస్తోందన్నారు. 

★ బిట్‌ పేపర్‌ను ఎత్తివేసి, దాని స్థానంలో ఏకవాక్య సమాధానాలు రాసేలా ప్రశ్నలు ఇచ్చే ప్రతిపాదన ఉందన్నారు. 

★ కొన్ని దశాబ్దాలుగా నిలిచిపోయిన ఎయిడెడ్‌ పాఠశా లల టీచర్‌ పోస్టుల భర్తీని ప్రభుత్వం పరిశీలి స్తోందని నరసింహారావు వెల్లడి. 

★ రీజియన్‌ పరిధిలోని టీచర్ల సమస్యల పరిష్కారానికి నెలకోసారి కాకి నాడ ఆర్జేడీ కార్యాలయంలో అర్జీల పరిష్కార (గ్రీవెన్స్‌డే) కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించినట్లు వెల్లడి.

★ ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు బోధనాంశాలు, బోధనా పద్ధతులు సమర్థవంతంగా అమల య్యేలా సిలబస్‌ను తగ్గించినట్టు ఆర్జేడీ చెప్పారు. 

           

SUBSCRIBE TO OUR NEWSLETTER

Related Posts :

  • ‘పది’ పరీక్షల్లో* *సంస్కరణలు*✨ ‘పది’ పరీక్షల్లో* *సంస్కరణలు.*★ పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల్లో సమూల మార్పులను తెచ్చేందుకు పలు ప్రతిపాదనలు ప్రభుత్వ పరి శీలనలో ఉన్నాయన… ...

0 Response to " ‘పది’ పరీక్షల్లో* *సంస్కరణలు"

Post a Comment