సి.పి.యస్ పై కేబినెట్ నిర్ణయం ఏమిటి పూర్తి వివరాలు...
కేబినెట్ సూత్రప్రాయ ఆమోదం
సమస్యలు-పరిష్కారాలపై కమిటీ
అమరావతి, జూన్ 10(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఉద్యోగుల చిరకాల డిమాండ్ అయిన కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం (సీపీఎస్) రద్దుకు రాష్ట్ర మంత్రివర్గం సూత్రప్రాయంగా అంగీకరించింది.
దీనిపై తదుపరి విధివిధానాల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేసింది
. ఈ కమిటీలో సంబంధిత శాఖల కార్యదర్శులు సభ్యులుగా ఉంటారు. వైఎస్ జగన్ అధ్యక్షతన సోమవారం తొలిసారి జరిగిన కేబినెట్ సమావేశంలో సీపీఎస్ పై చర్చించారు
. సీపీఎస్ రద్దు వల్ల తలెత్తే ఆర్థిక, చట్టపరమైన చిక్కులను ముందుగానే అంచనా వేసి వాటి పరిష్కారం సూచించే బాధ్యతలను బుగ్గన నేతృత్వంలో ఏర్పాటు చేసిన కమిటీకి అప్పగించారు
. 2004 సెప్టెంబరు 1వ తేదీ నుంచి విధుల్లో చేరిన ఉద్యోగులు సీపీఎస్ పరిధిలోకి వస్తారు. సీపీఎస్ విధానం ద్వారా ఒక ఉద్యోగి రిటైర్మెంట్ నాటికి ఎంత జమ అవుతుంది...
ఒకవేళ పాత పెన్షన్ విధానం కొనసాగితే ఆ ఉద్యోగికి ఎంత పెన్షన్ వెళ్తుంది అనే లెక్కలు తీసి..
ఆ రెండింటి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని రిటైర్మెంట్ సమయంలో ఆ ఉద్యోగికి చెల్లించాలనే ఒక అభిప్రాయం కూడా ఉందని ఆర్థిక శాఖ అధికారులు తెలిపారు.
0 Response to "సి.పి.యస్ పై కేబినెట్ నిర్ణయం ఏమిటి పూర్తి వివరాలు..."
Post a Comment