ఉద్యోగ,ఉపాద్యాయులు,విద్యా వ్యవస్థ పై జరిగిన కేబినెట్ నిర్ణయాలు(సిపియస్,ఐఆర్,అమ్మఒడి) పూర్తి వివరాలు..

 ఉద్యోగుల చిరకాల డిమాండ్‌ కంట్రిబ్యూటరీ పింఛను పథకం రద్దుకు ముందడుగు వేసింది. 


జులై ఒకటో తేదీ నుంచి అమలయ్యేలా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ 27శాతం మధ్యంతర భృతిని ఆమోదించింది.


 అంగన్‌వాడీలు, ఆయాలు, హోంగార్డులు, ఆశా కార్యకర్తలు, పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలను పెంచింది. ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణపై మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటుకానుంది. 


బిడ్డలను బడికి పంపే తల్లులకు ఏడాదికోసారి రూ.15వేలు అందించే ‘అమ్మ ఒడి’ని జనవరి 26నుంచి అమలు చేయాలని నిర్ణయించింది


 భాగస్వామ్య పింఛను పథకం రద్దు

*  కార్యాచరణకు ఆర్థికమంత్రి నేతృత్వంలో కమిటీ ఏర్పాటు



*  1 నుంచి ప్రభుత్వోద్యోగులకు 27 శాతం తాత్కాలిక భృతి

*  దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వంపై ఏడాదికి రూ.815 కోట్ల మేర అదనపు భారం

*  4.24 లక్షల మంది ఉద్యోగులకు లబ్ధి 



*  ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణపై మంత్రివర్గ ఉపసంఘం


 గ్రామీణ, పట్టణ పేదరిక నిర్మూలన సంస్థల్లో రిసోర్సుపర్సను, యానిమేటర్లకు నెలకు రూ.10 వేల గౌరవ వేతనం 



*  అంగన్‌వాడీ కార్యకర్తల వేతనాన్ని రూ.10,500 నుంచి రూ.11,500కు, అంగన్‌వాడీ ఆయాల వేతనాన్ని రూ.6 వేల నుంచి రూ.7 వేలకు పెంపు 



*  హోంగార్డులకు తెలంగాణలో చెల్లిస్తున్న వేతనం కంటే రూ.వెయ్యి ఎక్కువ ఇవ్వాలని నిర్ణయం

*  అన్ని శాఖల్లోని పారిశుద్ధ్య కార్మికులకు నెలకు రూ.18 వేల వేతనం ఇచ్చే అంశంపై ఆయా శాఖల కార్యదర్శులతో కమిటీ ఏర్పాటు

*  ఆశావర్కర్ల వేతనం రూ.3 వేల నుంచి రూ.10 వేలకు పెంపు



జనవరి 26 నుంచి అమ్మఒడి

*  బిడ్డలను బడికి పంపే తల్లులకు ఏడాదికి రూ.15 వేలు

*  ప్రైవేటు పాఠశాలల్లో 25% సీట్లు పేద, మధ్య తరగతి వారికి తప్పనిసరి

*  దశలవారీగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు


డిమాండ్

:అమ్మ ఒడి పథకాన్ని విద్యావ్యాపారాన్ని వ్యతిరేకిస్తూ అమలు పరచాలి

లేకుంటే ప్రభుత్వ పాఠశాలలకు ప్రమాదమే

సివిప్రసాద్


SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "ఉద్యోగ,ఉపాద్యాయులు,విద్యా వ్యవస్థ పై జరిగిన కేబినెట్ నిర్ణయాలు(సిపియస్,ఐఆర్,అమ్మఒడి) పూర్తి వివరాలు.."

Post a Comment