పాఠ్య పుస్తకాలు సిద్ధంస్కూళ్లు తెరిచే సరికి విద్యార్థుల చేతికి

  • స్కూళ్లు తెరిచే సరికి విద్యార్థుల చేతికి
  • 46,786 స్కూళ్లలో 39,04,145 మందికి
  • ఇప్పటికే జిల్లాలకు చేరిన 1.85 కోట్ల పుస్తకాలు
  • పాఠ్యపుస్తక విభాగం ఆల్‌టైమ్‌ రికార్డ్‌

అమరావతి, మే 31(ఆంధ్రజ్యోతి): పాఠ్యపుస్తకాల ముద్రణ.. పంపిణీ.. సరఫరాల్లో ఇదో చరిత్ర.



 రాష్ట్రంలో ప్రభుత్వ, జిల్లా, మండల పరిషత్‌, బీసీ, సామాజిక, ఎస్టీ సంక్షేమం, మున్సిపల్‌, కేజీబీవీ.. తదితర అన్ని యాజమాన్యాల పాఠశాలలు 46,786 ఉండగా.. వాటిలో చదివే 39,04,145 మంది విద్యార్థులకు తొలిసారిగా జూన్‌ 12 నాటికి పాఠ్యపుస్తకాలను ఉచితంగా అందించే అసాధారణ ప్రక్రియ ఇది.


గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి పాఠ్యపుస్తక విభాగం ప్రత్యేక శ్రద్ధ కనబరిచింది. మూణ్నెల్ల ముందుగానే ప్రణాళికా బద్ధంగా చర్యలు చేపట్టి ఆల్‌టైమ్‌ రికార్డు సాధించింది. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి పదో తరగతి విద్యార్థులకి 240 టైటిళ్లలో నికరంగా 2,07,02,288 పాఠ్యపుస్తకాలు అవసరం. ప్రతి విద్యా సంవత్సరంలోనూ జూన్‌ 12న పాఠశాలలు పునఃప్రారంభమవుతున్నా.. అధికార యంత్రాంగం ముందస్తు చర్యలు చేపట్టని కారణంగా విద్యార్థులకు సకాలంలో పాఠ్యపుస్తకాలు అందేవికావు. కొన్ని విద్యా సంవత్సరాల్లో అయితే.. రెండు లేదా మూడు నెలల వరకు పుస్తకాలు ఆలస్యమయ్యేవి. ఆలోగా అకడమిక్‌ క్యాలెండర్‌ను అనుసరించి కొంత సిలబస్‌ కూడా పూర్తి చేయాల్సిన పరిస్థితి ఏర్పడేది. ఈ విషయంలో తీవ్ర విమర్శలు రావడం సర్వసాధారణంగా మారింది. ఈ నేపథ్యాన్ని తీవ్రంగా పరిగణించిన పుస్తక విభాగం.. తొలిసారిగా ఆన్‌లైన్‌ ట్రాకింగ్‌ సిస్టమ్‌ను పక్కాగా అమలు చేసింది.

ప్రస్తుత విధానం ఇదీ

ఛైల్డ్‌ ఇన్ఫో డేటాను ప్రాతిపదికగా తీసుకుని పాఠశాల స్థాయి నుంచే మ్యాపింగ్‌ చేసి కార్యాచరణ చేపట్టారు. ముద్ర ణను 47 మంది ప్రింటర్లకు అప్పగించారు. ముద్రణ, పంపిణి, సరఫరా.. తదితర ప్రక్రియలను జిల్లా, మండల, స్కూలు పాయింట్లకు చేరే ప్రక్రియలను పూర్తిగా ఆన్‌లైన్‌ చేయడం ద్వారా పారదర్శకత ఏర్పడింది. 2019-20 విద్యా సంవత్సరంలో మొత్తం 2.07 కోట్ల పాఠ్యపుస్తకాలు అవసరం కాగా, మే 31 నాటికి 1.85 కోట్ల పుస్తకాలు జిల్లాలకు చేరాయి. మిగిలిన 22 లక్షల పాఠ్యపుస్తకాలను జూన్‌ 5లోగా జిల్లాలకు చేర్చేలా చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాల నుంచి 1.59 కోట్ల పాఠ్యపుస్తకాలు ఇప్పటివరకు మండలాలకు చేరాయి. వీటిలో 66 లక్షల పుస్తకాలు ఇప్పటికే పాఠశాలలకు కూడా చేరడం గమనార్హం. జూన్‌ 10లోగా పూర్తి స్థాయిలో పాఠశాలలకు చేర్చే దిశగా చర్యలు తీసుకుంటున్నారు.

సమయపాలన.. ట్రాకింగ్‌ సిస్టమ్‌: కృష్ణారెడ్డిపాఠ్యపుస్తకాల పంపిణీ విషయంలో ప్రస్తుత విద్యాసంవత్సరంలో తీసుకున్న చర్యలపై పాఠ్యపుస్తక విభాగం డైరెక్టర్‌ కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. తొలిసారిగా పూర్తిస్థాయిలో ఆన్‌లైన్‌ ట్రాకింగ్‌ సిస్టంను అమలు చేశామని తెలిపారు. పేపర్‌ కొనుగోలు టెండర్‌ ప్రక్రియ నుంచి సమయపాలన చేపట్టామని, జిల్లా, మండల, పాఠశాల స్థాయి వరకు జవాబుదారీ తనం, పారదర్శకత తీసుకువచ్చామని వివరించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పాఠశాలలు పున:ప్రారంభమయ్యే నాటికి విద్యార్థుల చేతికి ఉచితంగా ఏర్పాట్లు చేపడుతున్నట్లు స్పష్టం చేశారు. పుస్తకాలు పిల్లలకు చేరాయో లేదో చెక్‌ చేసేందుకు యాప్‌ను కూడా వారికి చేరువ చేస్తామన్నారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "పాఠ్య పుస్తకాలు సిద్ధంస్కూళ్లు తెరిచే సరికి విద్యార్థుల చేతికి"

Post a Comment