భౌతికశాస్త్రం పాఠ్యాంశాల్లో మార్పులు ♦8, 9, 10 తరగతులకు సర్దుబాటు
♦8, 9, 10 తరగతులకు సర్దుబాటు
-లక్ష్య ఫౌండేషన్ కథనం
🔺పదో తరగతిలో ఉత్తీర్ణతా శాతం పెంచేందుకు ఇప్పటి వరకు విద్యాశాఖ పలు చర్యలు చేపట్టింది. మరోవైపు తమ పాఠశాలల్లో విద్యార్థులందరినీ ఉత్తీర్ణులను చేసేందుకు ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు అదనపు తరగతులు చేపడుతున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులపై మానసిక, శారీరక ఒత్తిడి పెరుగుతోంది. దీన్ని నివారించే దిశగా వచ్చే విద్యాసంవత్సరం నుంచి పదో తరగతిలో బోధించే పాఠ్యాంశాల్లో విషయాన్ని మరింత పెంచి, వీటిని 8వ తరగతి నుంచి బోధించే దిశగా చర్యలు చేపట్టారు. ముందుగా ఎక్కువగా విద్యార్థులు ఇబ్బందిపడే భౌతికశాస్త్రంపై దృష్టిసారించి, 8, 9, 10వ తరగతి పాఠ్యాంశాల్లో మార్పులు చేశారు.
2018-19 విద్యాసంవత్సరం వరకు 8, 9 తరగతుల్లో భౌతికశాస్త్రం పది పాఠ్యాంశాలతో బోధించారు. 10వ తరగతిలో అదనంగా మరో నాలుగు చేర్చి మొత్తం 14 పాఠ్యాంశాలతో బోధన సాగించారు. ఒకేసారి అదనంగా మరో నాలుగు పాఠాలు చేరటంతో విద్యార్థులు ఒత్తిడికి గురయ్యారు. మరోవైపు తాము బోధిస్తున్న పాఠ్యాంశాల్లో విషయం తక్కువగా ఉంటోందని, ఆయా పాఠాల్లో మార్పులు చేయాలని అధికారులను ఉపాధ్యాయులు కోరుతున్నారు. ఇప్పటికే ఒత్తిడికి గురవుతున్న విద్యార్థులు, పాఠంలో విషయం లేక పూర్తిస్థాయిలో బోధించలేకపోతున్నామంటున్న ఉపాధ్యాయుల నడుమ విద్యాశాఖ ఏ నిర్ణయమూ తీసుకోలేని పరిస్థితిని ఎదుర్కొంది. తాజాగా రూపొందించిన పాఠ్యాంశాలలో ఎనిమిదో తరగతి భౌతికశాస్త్రంలో 12, తొమ్మిదో తరగతిలో 11, పదో తరగతిలో 12 ఉండేలా రూపొందించారు.
👉ఇవీ మార్పులు
♦10వ తరగతిలో తొలగించిన పాఠాలు
● రసాయన చర్యలు - సమీకరణాలు
● కాంతి పరావర్తనం
- గతంలో ఉన్న పాఠ్యాంశాలు 14. వీటిలో రెండింటిని తగ్గించటంతో వచ్చే ఏడాది వీటి సంఖ్య 12.
♦9వ తరగతిలో ..
●వక్రతలాల వద్ద పరావర్తనం (పదిలో తొలగించిన కాంతి పరావర్తనం ద్వితీయ భాగాన్ని 4వ పాఠంగా చేర్చారు)
● ప్రమాణాలు - గ్రాఫ్లు (అదనంగా చేర్చారు)
●మన చుట్టూ ఉన్న పదార్థం శుద్ధమేనా...? (3వ పాఠ్యాంశాన్ని తొలగించారు)
గతంలో ఉన్న పాఠ్యాంశాలు 10. ఒక పాఠాన్ని తొలగించి, రెండింటిని అదనంగా చేర్చటంతో వీటి సంఖ్య 11.
♦8వ తరగతిలో..
సమతులాల వద్ద పరావర్తనం (పదిలో తొలగించిన కాంతి పరావర్తనం తొలిభాగాన్ని పదో పాఠంగా చేర్చారు)
●మనచుట్టూ ఉన్న పదార్థం శుద్ధమేనా...? (తొమ్మిదిలో తొలగించిన పాఠ్యాంశాన్ని 3వ పాఠంగా చేర్చారు)
- గతంలో ఉన్న పాఠ్యాంశాలు 10. అదనంగా రెండు చేరటంతో వీటి సంఖ్య 12.
🌻విషయ పరిజ్ఞానం పెంపొందించేందుకే
విద్యార్థుల్లో భౌతికశాస్త్రంపై విషయ పరిజ్ఞానం పెంపొందించే దిశగా గతం నుంచి మేము పాఠ్యాంశాల్లో మార్పులు కోరుతున్నాం. ఎక్కువ పాఠాలు ఒకే ఏడాది ఉండటంతో విద్యార్థులు ఇప్పటికే ఒత్తిడికి గురవుతున్న నేపథ్యంలో పాఠాల్లో విషయాన్ని పెంచి, విభజించి, మూడు తరగతులకు సర్దుబాటు చేయటం హర్షణీయం. తద్వారా ఉన్నత విద్యావకాశాలు పొందే సమయంలో విద్యార్థుల్లో ఉన్న విషయ నైపుణ్యం ఉపయోగపడేందుకు అవకాశం ఏర్పడింది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి 8వ తరగతిలోనే విద్యార్థులు భౌతికశాస్త్రంలో ఎక్కువ అంశాలు నేర్చుకునేందుకు వీలుగా పాఠాలను రూపొందించారు
0 Response to "భౌతికశాస్త్రం పాఠ్యాంశాల్లో మార్పులు ♦8, 9, 10 తరగతులకు సర్దుబాటు"
Post a Comment