ఆసుపత్రికి వచ్చిన ప్రభుత్వ ఉపాధ్యాయుడి అదృశ్యం

జూబ్లిహిల్స్‌, న్యూస్‌టుడే: కంటి ఆసుపత్రికి చికిత్స కోసం వచ్చిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు అదృశ్యమైన సంఘటన బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకొంది. 


పోలీసుల కథనం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా కంభం మండలానికి చెందిన ప్రభుత్వ గణిత ఉపాధ్యాయుడు, ఎన్‌సీసీ అధికారి అరవీటి వెంకట శ్రీరాములు కంటిచూపు మందగించడంతో బంజారాహిల్స్‌లోని ఎల్వీప్రసాద్‌ నేత్ర వైద్య వైద్యశాలకు ఈ నెల 2వ తేదీన వచ్చారు. 


వైద్యుల అపాయింట్‌మెంట్‌ కోసం ఆసుపత్రికి వెళ్లారు. ఆయన సోదరుడు అరవీటి వెంకటేశ్వరగుప్తా లోపలికి వెళ్లి 4వ తేదీన ఉదయం వైద్యుల ఆపాయింట్‌మెంట్‌ తీసుకొని బయటకు వచ్చారు. 


అయితే అక్కడే ఉన్న సోదరుడు వెంకట శ్రీరాములు కనిపించలేదు


దీంతో ఆయన పరిసరాల్లో వెతికినా ఆచూకీ లభించలేదు.


 శనివారం రాత్రి బంజారాహిల్స్‌ పోలీసులకు ఈ విషయంపై ఫిర్యాదు చేశారు. 


బంజారాహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

ఆయన ఆచూకీ తెలిస్తే చరవాణి నం. 9985988525, 9908404131లకు సమాచారం అందించాలని కోరారు


CVPRASAD

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "ఆసుపత్రికి వచ్చిన ప్రభుత్వ ఉపాధ్యాయుడి అదృశ్యం"

Post a Comment