📚✍️రోజుకు 2 సబ్జెక్టుల్లో* *కోచింగ్✍️📚* *♦️టెన్త్ విద్యార్థుల కోసం పాఠశాల విద్యాశాఖ ప్రణాళిక* *♦️ఫెయిలైన ప్రతి విద్యార్థి మీద ఫోకస్* *♦️13 నుంచి పరీక్షలు ముగిసేవరకు స్కూళ్లలో వారికి ప్రత్యేక బోధన* *♦️ఆర్జేడీలు, డీఈవోలకు మార్గదర్శకాలు
**PROCEEDINGS OF THE COMMISSIONER OF SCHOOL EDUCATION
ANDHRA PRADESH # 1BRAHIMPATNAM
Present: Sri. S Suresh Kumar, IAS]
Rc.No: GE-EXAMOSSCINST)/8/2022-DGE
Dated:08/06/2022
Sub:- SsC Advanced Supplementary Examinations, July-2022 -
Conduct Special Coaching Classes for the students who are
90 " uppenenary ExAihalons,
esults Tess Note vVide
ORDER:
The Results of SsC Publie Examinations,. April/May-2022 have been
released on 06-06-2022 and 2.01.627 students out of the appeared 6,15.908
students have failed in the Examinations. After the analysis of SSC Public
Examinations, April/May- 2022 Results it is found that many students failed
in the Examination due to the learning loss they have experienced during
cOVID situation in the state during the past two years.
In view of the above, we have to encourage all students who have failed
ake
to
nination s
2022. All the RJDSEs and District Educational officers are herecby
instructed to take measures for conducting of special coaching classes
( Remedial classes) in all High schools for the students who have failed in
SSC Public Examinatons, April/May-2022. Plan remedial coaching for at
least subjects per day trom 13-062022 onwards till the completion of
Advanced Supplementary Examinations, July-2022. The students to be
gven subject/ tople specific coaching and prepare them to perform well in
the Advanced Supplementary Examinations. The students shall be properly
guided and counseled to use the avallable tome to revise the subjects, and
write the supplemerntary exams with confiodence. The Speclal coaching
classes are planned in the interest ol the students and parents.
The District Educational Officers shall 1ssue necessary instructions
accordingy and ensure that suficient subject teachers are dralted in all
High Schools where the remedial classes are required. School wise plan
along with the time table and list of teachers drafted for the same shall be
prepared and communicated to DGE latest by 12.06.22.
This shall be treated on Highest priority
File No.GE-EXAMOSSC(INSTyar2022-DGE
sd/- S. SURESH KUMAR
cOMMISSIONER OF SCHoOL EDUCATION
*🌻సాక్షి, అమరావతి:* రాష్ట్రంలో టెన్త్ పబ్లిక్ పరీక్షల్లో ఫె లైన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను అడ్వా న్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు సంసిద్ధం చేసేందుకు పాఠశాల విద్యాశాఖ ప్రణాళికను సిద్ధం చేసింది. ఈమేరకు రాష్ట్రంలోని ప్రాంతీయ సంయుక్త సంచా లకులు (ఆర్జేడీలు), జిల్లా విద్యాధికారులకు (డీ ఈవోలకు) పాఠశాలవిద్య కమిషనర్ ఎస్.సురేషు మార్ మార్గదర్శకాలు జారీచేశారు. రోజూ రెండు సబ్జెక్టులపై విద్యార్థులకు బోధన సాగేలా కార్యాచర ణ చేపట్టాలని సూచించారు. 'ఈనెల 6వ తేదీన ఫలితాలు విడుదలైన టెన్త్ పబ్లిక్ పరీక్షలకు హాజరైన 6,15,908 మంది విద్యార్థుల్లో 2,01,627 మంది ఫెయిలయ్యారు. రెండేళ్లుగా కరోనా వల్ల పాఠశాల ల్లో ప్రత్యక్ష బోధన లేక విద్యార్థుల్లో అభ్యాస నష్టం వల్ల వారంతా ఫెయిలైనట్లు విశ్లేషణలో తేలింది. వీరికి జూలైలో అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయి. ఫెయిలైన విద్యార్థులు ఈ పరీక్షల్లో రాణించేలా వారికి ప్రత్యేక తర్ఫీదు ఇవ్వాల్సిన అవ సరముంది. ఇందుకోసం సబ్జెక్టు, టాపిక్స్ వారీగా స్పెసిఫిక్ కోచింగ్ను చేపట్టాలి. ఈనెల 13వ తేదీనుంచి పరీక్షలు పూర్తయ్యేవరకు రోజుకు రెండు సబ్జెక్టుల్లో విద్యార్థులకు శిక్షణ ఇచ్చేలా ప్రణాళికలను
రూపొందించాలి. విద్యార్థులతో సబ్జెక్టులను పునశ్చ రణ చేయించాలి. వారు ఆత్మవిశ్వాసంతో పరీక్షలను ధైర్యంగా ఎదుర్కొని విజయం సాధించేలా వారిని తీర్చిదిద్దాలి..' అని వివరించారు. విద్యార్థులు, తల్లి దండ్రుల ప్రయోజనార్థం ఈ కోచింగ్ తరగతులను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రాంతీయ సంయు క్త సంచాలకులు, జిల్లా విద్యాధికారులు శ్రద్ధ తీసు కుని ఏర్పాట్లు చేయాలని సూచించారు. దీనికి సం బంధించిన ప్రణాళికలను రూపొందించుకోవాలని పేర్కొన్నారు. రెమిడియల్ తరగతులు అవసరమైన స్కూళ్లలో సబ్జెక్టు టీచర్లను ఏర్పాటు చేయాలని సూచించారు. స్కూళ్ల వారీగా ప్రణాళికలను, టైమ్ టేబుళ్లను రూపొందించుకోవాలని పేర్కొన్నారు. ఏ టీచర్ ఏ సమయంలో స్కూల్లో ఆయా సబ్జెక్టులపై తర్ఫీదు ఇవ్వాలో కూడా జాబితా రూపొందిం చాలని సూచించారు. ఈ ప్రణాళికలను ప్రభుత్వ పరీక్షల డైరెక్టరేట్కు సమర్పించాలని నిర్దేశించారు. తరగతుల నిర్వహణకు ఏర్పాట్లు
పాఠశాలవిద్య కమిషనర్ మార్గదర్శకాలు అందిన వెంటనే జిల్లాల్లో క్షేత్రస్థాయి అధికారులు ఆ దిశగా ఏర్పాట్లు చేపట్టారు. కొన్ని జిల్లాల విద్యాధికారులు ఈ ఏర్పాట్లపై డిప్యూటీ డీఈవోలు, ఎంఈవోలు, హెడ్మాస్టర్లకు సూచనలిచ్చారు. క్షేత్రస్థాయి అధికారులతో స్కూళ్ల వారీగా తరగతుల నిర్వహణకు పక డ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయా జిల్లాల్లోని స్థానిక పరిస్థితుల ఆధారంగా ఎవరు ఏ బాధ్యత నెరవేర్చాలో సూచనలు జారీచేస్తున్నారు.
*👉కొందరు డీఈవోలు జారీచేసిన సూచనలు.👇👇.*
» సంబంధిత ప్రధానోపాధ్యాయుడు తప్ప నిసరిగా తన పాఠశాలలో టెన్త్ ఫెయిలైన విద్యార్థులంతా ఈ ప్రత్యేక తరగతులకు హాజరయ్యేలా చూడాలి.
▪️షెడ్యూల్ ప్రకారం తరగతులకు హాజరు కావాలని ఆయా సబ్జెక్టుల ఉపాధ్యాయు లకు తెలియజేయడంతో పాటు వారి సబ్జెక్టు విభాగం ప్రకారం బాధ్యత ఇవ్వాలి.
» సంబంధిత సీఆర్పీ సహాయంతో గూగుల్ ఫారం ద్వారా రోజువారీ హాజరు నివేదికను డీసీఈబీ సెక్రటరీకి సమర్పించాలి.
▪️సబ్జెక్టు టీచర్లందరూ తమ సబ్జెక్టుల్లో ఫలితాల మెరుగుదల కోసం సొంత కార్యచరణ ప్రణాళికను సిద్ధం చేసుకుని అమలు చేయాలి.
▪️సబ్జెక్టు వారీగా ప్లాన్తో పాటు టైప్డేబుల్, దానికోసం రూపొందించిన ఉపాధ్యాయుల జాబితాను గూగుల్ ఫారం ద్వారా ప్రధానోపాధ్యాయులు జూన్ 11వ తేదీ నాటికి డీసీఈబీలకు తెలియజేయాలి.
» రెమిడియల్ తరగతులు ఉదయం 8.30నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఉంటాయి.
» ఈ కార్యక్రమాలు సమర్థంగా అమలయ్యేలా డిప్యూటీ డీఈవోలు పర్యవేక్షించాలి. తక్కువ పనితీరు కనబరుస్తున్న పాఠశాల లపై ప్రత్యేక దృష్టి సారించాలి.
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇
0 Response to "📚✍️రోజుకు 2 సబ్జెక్టుల్లో* *కోచింగ్✍️📚* *♦️టెన్త్ విద్యార్థుల కోసం పాఠశాల విద్యాశాఖ ప్రణాళిక* *♦️ఫెయిలైన ప్రతి విద్యార్థి మీద ఫోకస్* *♦️13 నుంచి పరీక్షలు ముగిసేవరకు స్కూళ్లలో వారికి ప్రత్యేక బోధన* *♦️ఆర్జేడీలు, డీఈవోలకు మార్గదర్శకాలు"
Post a Comment