రిటైర్డు ఉద్యోగి నుంచి రికవరీలు తగదు: సుప్రీం

న్యూఢిల్లీ, మే 2: ఉద్యోగికి అదనంగా చెల్లించిన సొమ్మును రిటైరయిన తరువాత ఆయన నుంచి తిరిగి వసూలు చేయొద్దని సుప్రీంకోర్టు సోమవారం తీర్పి చ్చింది. 

కేరళకు చెందిన థామస్‌ డేనియల్‌ విద్యా శాఖలో పనిచేశారు. ఒక నిబంధనను తప్పుగా అన్వయించి 1989-1991 మధ్య ఆయనకు అదనంగా ఇంక్రిమెంట్‌ ఇచ్చారు.


 1999లో ఆయన రిటైర్డ్‌ అయ్యారు. అదనపు చెల్లింపులు జరిగినట్టు ఆడిటింగ్‌లో గుర్తించడంతో పదేళ్ల అనంతరం రికవరీకి ఆదేశాలు ఇచ్చారు. 


దీనిపై ఆయన సుప్రీంకు వెళ్లగా.. ఈ మేరకు తీర్పిచ్చింది

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "రిటైర్డు ఉద్యోగి నుంచి రికవరీలు తగదు: సుప్రీం"

Post a Comment