వచ్చే 2047 నాటికి భారత్‌లో ప్రతి చిన్నారికీ అందుబాటులో చదువు నోబుల్‌ బహుమతి గ్రహీత కైలాస్‌ సత్యార్థి ఆకాంక్ష


వాషింగ్టన్‌, మే 3: భారత్‌లో ప్రతి చిన్నారి వచ్చే 2047 నాటికి చదువుకోగలడని, స్వేచ్ఛాయుత వాతావరణంలో పెరిగి.. కలల్ని సాకారం చేసుకునేందుకు వీలుగా అవకాశాలను అందిపుచ్చుకోగలడన్న ఆశాభావాన్ని నోబుల్‌ బహుమతి గ్రహీత కైలాశ్‌ సత్యార్థి  వ్యక్తంచేశారు.



 అదే ఏడాది స్వాంత ంత్య్రం వచ్చి వందేళ్లు కానున్న నేపథ్యంలో దేశం ఉత్సవాలు జరుపుకోనున్న నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అమెరికా పర్యటనలో భాగంగా సత్యార్థి మీడియాతో మాట్లాడుతూ  బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన దిశగా



 నరేంద్రమోదీ సర్కార్‌ చర్యలు ‘‘ఎంతో మెరుగ్గా’’ ఉన్నాయని ప్రశంసించారు. అయితే భారత్‌లో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు సామాజిక, రాజకీయ చిత్తుశుద్ధి ఎంతో అవసరమని సత్యార్థి అభిప్రాయపడ్డారు. ఈదిశగా



 ప్రభుత్వానికి సమాజం, ప్రైవేటు రంగం అండగానిలవాల్సిన అవసరం ఉందని చెప్పారు.  ఉపాధికి సంబంధించి కనీస వయోపరిమితిపై అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌వో) తీర్మానంపై అగ్రరాజ్యం అమెరికా ఇంతవరకూ సంతకం


 చేయకపోయినా..భారత్‌ దానిని ఆమోదించడం ద్వారా ఓ అడుగు ముందుకువేసిందని తెలిపారు


SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "వచ్చే 2047 నాటికి భారత్‌లో ప్రతి చిన్నారికీ అందుబాటులో చదువు నోబుల్‌ బహుమతి గ్రహీత కైలాస్‌ సత్యార్థి ఆకాంక్ష"

Post a Comment