కేబినెట్ భేటీ తర్వాత రాజీనామా చేయనున్న మంత్రులు

అమరావతి: ఏపీ కేబినెట్ భేటీ ముగిసింది. ఏపీ మంత్రులు రాజీనామా చేశారు. ఈ మేరకు గవర్నర్ హరిచందన్‌కు మంత్రుల రాజీనామాలను సీఎం జగన్ పంపనున్నారు. ఈ రాత్రికే మంత్రుల రాజీనామాలను గవర్నర్ ఆమోదించనున్నారు.


ఈ నెల 11న కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆదిమూలపు సురేశ్‌, సీదిరి అప్పలరాజు,  చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, గుమ్మనూరు జయరాంలు మళ్లీ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారని ప్రచారం జరుగుతోంది. తన కేబినెట్ ను విస్తరిస్తానని సీఎం జగన్ అప్పట్లోనే చెప్పారు. ఈ మేరకు తాజాగా తన కొత్త జట్టును ప్రకటించనున్నారు



ఏపీ కేబినెట్‌ కీలక నిర్ణయాల



అమరావతి: ఏపీ కేబినెట్‌ కీలక నిర్ణయాలు తీసుకుంది. కొత్తపేట, పులివెందుల రెవెన్యూ డివిజన్లకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. అంతేకాకుండా వైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకానికి కూడా కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఏపీ మిల్లెట్‌ మిషన్‌ 2022-23 నుంచి 2026-27 ప్రతిపాదనకు ఆమోదించారు. విద్య, వైద్య, ప్రణాళిక శాఖల్లో నియామకాలకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఏపీ కేబినెట్ భేటీ ముగిసింది. ఏపీ మంత్రులు రాజీనామా చేశారు. ఈ మేరకు గవర్నర్ హరిచందన్‌కు మంత్రుల రాజీనామాలను సీఎం జగన్ పంపనున్నారు. ఈ రాత్రికే మంత్రుల రాజీనామాలను గవర్నర్ ఆమోదించనున్నారు






అమరావతి: దాదాపు మూడేళ్లుగా కొనసాగుతున్న ‘మంత్రివర్గం’ ముచ్చట ముగిసిపోనుంది. గురువారం జరిగే కేబినెట్‌ సమావేశమే.... 



ప్రస్తుత మంత్రులకు ఆఖరి భేటీ కానుంది. అందువల్ల ఈ రోజు జరగుతున్న ఏపీ కేబినెట్ చాలా కీలకమైనది. ఈ కేబినెట్ భేటీ ప్రస్తుత మంత్రులు మాజీలవుతారు. 


కొత్త మంత్రులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారు. అందుకే ఈ భేటీ అంత్యంత ప్రదాన్యత సంతరించుకుంది. కొద్దిసేపటి క్రితం ఏపీ కేబినెట్‌ సమావేశం ప్రారంభమైంది. కేబినెట్ మీటింగ్ తర్వాత మంత్రులు రాజీనామా చేయనున్నారు. 


ఈనెల 11న కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాజీనామా చేసిన మంత్రులకు కేబినెట్ ర్యాంక్ ఇస్తారు. జిల్లా అభివృద్ధి మండలి తరహాలో రాజీనామా చేసిన మంత్రులకు పదవులు ఇస్తారు.

ఈ కేబినెట్ సమావేశంలో ‘కాబోయే మాజీ’లకు కర్తవ్య బోధ కూడా చేస్తారని.. 2024 ఎన్నికలు, రాజకీయ ప్రయోజనాలు, సామాజిక సమీకరణల కోణాలను వివరిస్తారని వైసీపీ ముఖ్యనేతలు చెబుతున్నా రు.


 రాజీనామాలు ఇచ్చేసిన తర్వాత... కేబినెట్‌ భేటీకి  హాజరైనవారు అధికారిక వాహనాల్లో తిరుగుముఖం పడతారా, లేక సొంత వాహనా ల్లో వెనుదిరుగుతారా అనేది గమనిస్తే చాలని .. లోపల ఏం జరిగిందో తెలిసిపోతుందని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. అందరి రాజీనామాలను ఆమోదించేసి.. 


తిరిగి ఈనెల 11న ఆదిమూలపు సురేశ్‌, సీదిరి అప్పలరాజు,  చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, గుమ్మనూరు జయరాంలను మళ్లీ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారని అధికార పార్టీ  పేర్కొంటున్నాయి

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "కేబినెట్ భేటీ తర్వాత రాజీనామా చేయనున్న మంత్రులు"

Post a Comment