నాలుగో విడత ఫార్మేటివ్ పరీక్షలు రద్దు
పాఠశాల విద్యార్థులకు నిర్దేశించిన సిలబస్ పూర్తికాకపోవడంతో నాలుగో విడత ఫార్మేటివ్ పరీక్షల్ని విద్యాశాఖ రద్దు చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది.
ఈ ఏడాది కొవిడ్ కారణంగా ఆగస్టు 16వ తేదీన పాఠశాలలు తెరిచారు. దానికి తగినట్లుగానే సిలబ్సను కూడా తగ్గించారు.
అయినా ఆ మేరకు కూడా సిలబస్ పూర్తికాలేదని సమాచారం. తొలి మూడు ఫార్మేటివ్ పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా నాలుగో ఫార్మేటివ్ పరీక్షల్లో మార్కులను ఇవ్వాలని జిల్లా విద్యాశాఖాధికారులకు నిర్దేశించినట్లు తెలిసింది
0 Response to "నాలుగో విడత ఫార్మేటివ్ పరీక్షలు రద్దు"
Post a Comment