జూన్ నుంచి నూతన విద్యావిధానం
*📚✍మండలానికి 2*
*జూనియర్ కళాశాలలు✍📚*
*♦22వేల మంది టీచర్లకు పదోన్నతులు*
*♦ముఖ్యమంత్రి జగన్ ఆదేశం*
*🌻ఈనాడు, అమరావతి:* మండలానికి రెండు జూనియర్ కళాశాలల ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఉన్నత పాఠశాలలనే జూనియర్ కళాశాలలుగా మార్చాలని సూచించారు. వాటిలో ఒకటి కో ఎడ్యుకేషన్, రెండోది కేవలం విద్యార్థినుల కోసమే ఉండాలన్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో గురువారం ఆయన పాఠశాల విద్యా శాఖపై మంత్రి ఆదిమూలపు సురేశ్తో కలిసి సమీక్షించారు. ‘వచ్చే ఏడాది జూన్ నాటికి నూతన విద్యా విధానానికి అనుగుణంగా అన్ని సంస్కరణలు పూర్తిగా అమల్లోకి రావాలి.
కొత్తగా ఏర్పాటవుతున్న పాఠశాలలతో 22 వేల మందికిపైగా ఉపాధ్యాయులకు పదోన్నతులు వస్తాయి. వీరందరికీ ఎస్జీటీ నుంచి స్కూల్ అసిస్టెంట్లుగా జూన్ నాటికి పదోన్నతులు ఇవ్వాలి’ అని ఆదేశించారు.
*♦కొత్తగా చేరిన విద్యార్థులకు నిఘంటువు*
పాఠశాలల్లో కొత్తగా చేరిన విద్యార్థులకు నిఘంటువులు అందించి, ప్రతిరోజూ ఒక పదాన్ని నేర్పాలి. 8, 9, 10 తరగతులకు డిజిటల్ విధానంలో బోధించాలి. దీన్నొక సబ్జెక్ట్గా పెట్టేలా ఆలోచించాలి. జగనన్న విద్యా కానుక, మరుగుదొడ్ల నిర్వహణ, గోరుముద్దలో నాణ్యత, పాఠశాలల నిర్వహణలో సమస్యలు తెలుసుకోడానికి ఏర్పాటు చేస్తున్న టోల్ఫ్రీ నంబరు 14417 సమర్థంగా పని చేయాలి’ అని సీఎం సూచించారు.
*♦ఎస్ఈఆర్టీ సిఫార్సులకు ఆమోదం*
పాఠశాల విద్యకు సంబంధించి ఎస్ఈఆర్టీ చేసిన సిఫార్సులను ముఖ్యమంత్రి ఆమోదించారు. వాటిలో... మండల రిసోర్సు సెంటర్ పేరును మండల విద్యాశాఖాధికారి కార్యాలయంగా మార్పు. ఎంపీడీవోకి కాకుండా ఎంఈవోకి డ్రాయింగ్ అధికారాలు, విద్య సంబంధిత కార్యకలాపాలన్నీ ఎంఈవోలకు అప్పగింత. ఎంఈవో పోస్టుల భర్తీ. యాప్స్ కన్నా... రియల్ టైం డాటా ఉండేలా చూడటం. ఆన్లైన్లో విద్యార్థుల హాజరుతోపాటు మార్కుల నమోదు. ఉపాధ్యాయులను బోధనేతర పనులకు వినియోగించరాదు... తదితర సిఫార్సులు ఉన్నాయి.
*♦పాఠశాలలను విలీనం చేయడం లేదు: అధికారులు*
నూతన విద్యా విధానంలో తరగతులు తప్పితే పాఠశాలలను విలీనం చేయడం లేదని సీఎంకు అధికారులు వివరించారు. పాతవి ఎట్టి పరిస్థితుల్లోనూ మూతపడవన్నారు. దీనిపై కొందరు అపోహ పడుతున్నారని అన్నారు.
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇
తరగతుల విలీనమే.. బడుల మూత ఉండదు
22వేలమంది ఎస్జీటీలకు పదోన్నతులు
ఇక ఎంఈవోలకే డ్రాయింగ్ అధికారాలు
8,9,10 తరగతులకు డిజిటల్ పాఠాలు
ఈనెల 15నుంచి నాడు-నేడు రెండో విడత
టీచర్లకు తప్పిన యాప్ల బెడద!.. విద్యాశాఖఫై సీఎం సమీక్ష
అమరావతి, ఫిబ్రవరి 3(ఆంధ్రజ్యోతి): జూన్ నుంచి నూతన విద్యావిధానం అమల్లోకి తేవాలని సీఎం జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. గురువారం తాడేపల్లి కాంపు కార్యాలయంలో నూతన విద్యావిధానం అమలుపై విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం.. పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు తగిన నిష్పత్తిలో ఉపాధ్యాయులు ఉండాలని నిర్దేశించారు. ఈ సందర్భంగా నూతన విద్యావిధానం అమలుపై అధికారులు సీఎంకు వివరాలు అందించారు. నూతన విద్యావిధానంలో తరగతుల విలీనమే కానీ, బడుల మూత ఉండదని వారు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. నూతన విద్యావిధానంలో ఏర్పాటవుతున్న పాఠశాలల వల్ల 22వేలమంది ఎస్జీటీలకు పదోన్నతులు వస్తాయని.. వీరందరికీ స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులివ్వాలని ఆదేశించారు.
సబ్జెక్టుల వారీగా ఉపాధ్యాయులు ఉండాలన్నారు. విద్యార్థుల నుంచి ఆన్లైన్ పద్ధతిలో హాజరు తీసుకోవాలన్నారు. ప్రతి మండలంలోని రెండు హైస్కూళ్లలో రెండు జూనియర్ కళాశాలలుగా ఏర్పాటు చేయాలని.. ఒకటి కో ఎడ్యుకేషన్కు, ఒకటి బాలికలకు ఉండాలని సూచించారు. మరోవైపు ఎస్ఈఆర్టీ ఇచ్చిన సిఫారసులన్నీ అమల్లోకి రావాలన్నారు. మండల రిసోర్స్ సెంటర్ను మండల విద్యాశాఖ అధికారి కార్యాలయంగా మార్చాలని నిర్ణయించారు. ఎండీవో పరిధిలో కాకుండా ఇక నేరుగా ఎంఈవోకే డ్రాయింగ్ అధికారాలు, విద్యాశాఖ కార్యకలాపాలు అప్పగించాలన్నారు. ఈ నెల 15నుంచి నాడు-నేడు రెండో విడత పనులు ప్రారంభించాలన్నారు. నాడు-నేడు రెండో విడత పనులను సెప్టెంబరు నాటికల్లా పూర్తిచేస్తామని అధికారులు తెలిపారు. ఉపాధ్యాయులకు పలు రకాల యాప్స్ కంటే.. రియల్టైం డేటా ఉండేలా, డూప్లికేషన్ లేకుండా చూడాలన్న ఎస్ఈఆర్టీ సిఫారసులు అమల్లోకి తీసుకురావాలని సీఎం సూచించారు. పాఠాలు బోధించే ఉపాధ్యాయులకు బోధనేతర పనులు అప్పగించొద్దని, ప్రధానోపాధ్యాయులతో అనేక సమావేశాలు కాకుండా సమన్వయం కోసం నెలకు ఒకే ఒక సమావేశం ఏర్పాటుచేయాలన్న సిఫారసులకు సీఎం ఆమోదం తెలిపారు. నూతన విద్యావిధానంలో మూడు కిలోమీటర్ల లోపే హైస్కూల్ ఉండేలా మ్యాపింగ్ చేస్తున్నామని అధికారులు వివరించారు.
మరుగుదొడ్లు, గోరుముద్దపై టోల్ఫ్రీ నంబర్
నాడు-నేడులో.. ఏ సదుపాయాల్లో ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. జగనన్న విద్యాకానుక, మరుగుదొడ్ల నిర్వహణ, జగనన్న గోరుముద్ద నాణ్యత, స్కూళ్ల నిర్వహణకు సంబంధించి ఏమైనా సమస్యలుంటే తెలిపేందుకు టోల్ఫ్రీ నంబరు 14417ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. పాఠశాలల్లో కొత్తగా చేరిన విద్యార్థులకు డిక్షనరీ ఇవ్వాలని, రోజుకో కొత్త పదం నేర్పించాలన్నారు. 8,9,10తరగతుల్లో డిజిటల్ లెర్నింగ్ ప్రవేశపెట్టాలని, దీన్ని ఒక సబ్జెక్టుగా పెట్టే ఆలోచన చేయాలని సీఎం సూచించారు. ఈ సమీక్షలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, సీఎస్ సమీర్శర్మ, పాఠశాల విద్య స్పెషల్ సీఎస్ బుడితి రాజశేఖర్, మహిళా, శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఎ.ఆర్.అనూరాధ పాల్గొన్నారు
0 Response to "జూన్ నుంచి నూతన విద్యావిధానం"
Post a Comment