వేతనజీవులకు మరోసారీ! ఆదాయపన్ను శ్లాబుల్లో ఎలాంటి మార్పూ ప్రకటించని ఆర్థిక మంత్రి



న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: బడ్జెట్‌ అనగానే వేతన జీవులంతా ఆశగా చూసేది.. ఆదాయపన్ను లెక్కల వైపే! ‘‘ఈసారైనా వ్యక్తిగత ఆదాయపన్ను శ్లాబులను మార్చకపోతారా? పన్ను తగ్గించకపోతారా?’’ .. అని బడ్జెట్‌ ప్రసంగం ఆసాంతం ఆసక్తిగా వీక్షిస్తారు. అందునా.. యూపీ, పంజాబ్‌ సహా ఐదు కీలక రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ఈసారి కచ్చితంగా ఆదాయపన్ను తగ్గిస్తారని చాలా మంది ఆశించారు. కానీ, ఈసారి కూడా వేతన జీవుల ఆశలన్నింటినీ నిర్మలా సీతారామన్‌ నిరాశ చేశారు! ఇన్‌కమ్‌ట్యాక్స్‌ శ్లాబుల్లో ఎలాంటి మార్పులనూ, తగ్గింపునూ ప్రకటించలేదు. ప్రస్తుతం రూ.50వేలుగా ఉన్న స్టాండర్డ్‌ డిడక్షన్‌ పరిమితిని కూడా పెంచలేదు. ఇంకా..



ట్యాక్స్‌ పేయర్లు పన్ను మదింపులో జరిగిన తప్పులను సవరించుకుని, సవరించిన పన్ను రిటర్నులను దాఖలు చేసే గడువును అసె్‌సమెంట్‌ ఏడాది నుంచి రెండేళ్లవరకూ పెంచుతున్నట్టు నిర్మల ప్రకటించారు.



వర్చువల్‌ డిజిటల్‌ ఆస్తుల బదలాయింపు ద్వారా వచ్చే ఆదాయంపై 30ు పన్ను కట్టాల్సి ఉంటుంది. అలాంటి ఆస్తులను కానుకగా ఇస్తే.. దాన్ని పొందేవారు ఆ పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాదు, ఇలాంటి లావాదేవీలు పన్ను పరిధి నుంచి తప్పించుకునే వీలు లేకుండా.. క్రిప్టో లావాదేవీలు ఏడాదికి రూ.10 వేలు దాటితే మూలం వద్ద 1ు పన్ను కోతను నిర్మల ప్రతిపాదించారు. దీంతో, మార్కెట్‌ ప్లేయర్లు ఈ లావాదేవీలపై మూలం వద్దే పన్ను విధించి, దాని గురించి ప్రభుత్వానికి తెలపాల్సి ఉంటుంది. ఇంతకీ వర్చువల్‌ డిజిటల్‌ ఆస్తులంటే ఏమిటి? అంటే.. క్రిప్టోగ్రాఫిక్‌ విధానంలో ఉత్పత్తి అయ్యే బిట్‌కాయిన్‌ వంటి క్రిప్టో కరెన్సీ, నాన్‌ ఫంగిబుల్‌ టోకెన్లు (ఎన్‌ఎ్‌ఫటీ), డెఫి విధానంలో జరిపే లావాదేవీలు ఈ పరిధిలోకి వస్తాయి. డిజిటల్‌ గోల్డ్‌,  సెంట్రల్‌ బ్యాంక్‌ డిజిటల్‌ కరెన్సీ వంటివి మాత్రం వర్చువల్‌ డిజిటల్‌ ఆస్తుల పరిధిలోకి రావు.



కార్పొరేట్లకు, సహకార సంఘాలకు సమాన అవకాశాలు కల్పించడానికి వీలుగా కో-ఆపరేటివ్‌ సొసైటీలు కట్టే ‘కనీస ప్రత్యామ్నాయ పన్ను’ను 18.5ు నుంచి 15 శాతానికి తగ్గించారు. అలాగే, రూ.కోటి నుంచి రూ.10 కోట్ల దాకా ఆదాయం ఉన్న సహకారసంఘాలపై విధిస్తున్న 12ు సర్‌చార్జీని 7 శాతానికి తగ్గించారు.





ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం కంట్రిబ్యూటరీ పెన్షన్‌ పరిధిలో ఉన్న తన ఉద్యోగుల జీతాల్లో 14 శాతాన్ని.. జాతీయ పింఛను పథకానికి తన వాటాగా చెల్లిస్తోంది. ఉద్యోగుల పన్ను ఆదాయాన్ని లెక్కించేటప్పుడు ఈ 14 శాతాన్ని (ప్రభుత్వ వాటా) మినహాయిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో ఈ మినహాయింపు పరిమితి ప్రస్తుతం 10 శాతం దాకానే ఉంది. కేంద్ర ఉద్యోగులతో సమానంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఈ మినహాయింపు పరిమితిని 14 శాతానికి పెంచుతూ నిర్మల నిర్ణయం తీసుకున్నారు. 



చాలా వ్యాపార సంస్థలు, కంపెనీలు.. ఐటీ సోదాల్లో వెల్లడించని ఆదాయం దొరికితే వెనకటి నష్టాల పేరుతో తప్పించుకుంటున్నాయి. ఇకపై అలాంటి తమాషాలు కుదరవని.. నష్టాల పేరుతో సర్దుబాటు చేసే అవకాశం లేదని ఆర్థిక మంత్రి స్పష్టం చేశారు.  



ప్రమోషన్‌ వ్యూహాల్లో భాగంగా వ్యాపారసంస్థలు తమకొచ్చే లాభాలను ఏజెంట్లకు బదిలీ చేస్తాయి. అలాంటి సందర్భాల్లో దాన్ని ఏజెంట్ల పన్ను ఆదాయంగా పరిగణిస్తారు. అలాంటి లావాదేవీలను ట్రాక్‌ చేసేందుకుగాను.. ఒక ఆర్థిక సంవత్సరంలో అందే అలాంటి ప్రయోజనాల విలువ రూ.20 వేలు దాటితే దానిపై మూలం వద్దే పన్ను కోత విధించాలని నిర్ణయించారు.



పన్నులకు సంబంధించిన న్యాయ వివాదాల తగ్గింపునకు ఆర్థిక మంత్రి కొన్ని ప్రత్యేక చర్యలనూ ప్రకటించారు.  




‘బోనస్‌’ స్ట్రిప్పింగ్‌కు చెక్‌  

బోనస్‌ స్ట్రిప్పింగ్‌ పేరుతో హైనెట్‌వర్త్‌ మదుపరులు (హెచ్‌ఎన్‌ఐ) చేస్తున్న పన్నుల ఎగవేతకు చెక్‌ పెట్టేందుకూ ఆర్థిక మంత్రి ఈ బడ్జెట్‌లో చర్యలు ప్రకటించారు. ప్రస్తుతం మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థలు జారీ చేసే బోనస్‌ యూనిట్లకు వర్తించే నిబంధనలను ఈక్విటీ షేర్లకూ వర్తింపజేయాలని నిర్ణయించారు. బోనస్‌ స్ట్రిప్పింగ్‌ అంటే.. ఎవరైనా ఒక మదుపరి ఒక్కో షేరును రూ.100 చొప్పున వెయ్యి షేర్లు కొన్నాడనుకున్నాం. ఇలా కొన్న వెంటనే ఆ కంపెనీ 1:1 నిష్పత్తిలో బోనస్‌ షేర్లు ప్రకటిస్తే అతడి వద్ద ఉన్న షేర్ల సంఖ్య 2,000కు చేరుతుంది. అప్పుడు మార్కెట్లో ఆ కంపెనీ షేర్ల సంఖ్య పెరిగి ధర రూ.50కి పడిపోయిందనుకుందాం. దీన్ని ఆసరాగా చేసుకుని ఆ మదుపరి వెయ్యి షేర్లను ఒక్కొక్కటీ రూ.50 చొప్పున అమ్మి రూ.50,000 నష్టంగా చూపించి, ఆ నష్టాన్ని వేరే మూలధన లాభాల నుంచి మినహాయింపు క్లెయిమ్‌ చేసుకుంటాడు.  నష్టం లేకున్నా ఇలా నష్టం పేరుతో పన్ను ఎగవేయడాన్ని బోనస్‌ స్ట్రిప్పింగ్‌ అంటారు.





స్థిరాస్తి విక్రయంపై టీడీఎస్‌

రూ.50 లక్షలకు పైబడిన వ్యవసాయేతర స్థిరాస్తి అమ్మకం ధర లేదా స్టాంప్‌ డ్యూటీ విలువ లేదా ఏది ఎక్కువైతే దానిపై ఒక శాతం టీడీఎస్‌ (మూలం వద్ద పన్నుకోత)ను వర్తింపజేయనున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఆదాయ పన్ను చట్టంలో సవరణల అనంతరం ఇది వర్తిస్తుందని తెలిపింది. ప్రస్తుతం స్థిరాస్తి విలువను పరిగణనలోకి తీసుకుని దాని ఆధారంగా టీడీఎ్‌సను మినహాయించుకుంటున్నారు. అయితే ఆదాయ పన్ను చట్టంలో టీడీఎస్‌ లెవీకి సంబంధించి సరైన విఽధానం లేకపోవటంతో ఈ మేరకు మార్పులు చేసినట్లు తెలిపింది

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to " వేతనజీవులకు మరోసారీ! ఆదాయపన్ను శ్లాబుల్లో ఎలాంటి మార్పూ ప్రకటించని ఆర్థిక మంత్రి"

Post a Comment