AP: ఉద్యోగ సంఘాల నేతలపై పోలీసుల నిఘా

అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ సంఘాల నేతలపై పోలీసులు నిఘా పెట్టారు. మంగళవారం రాత్రి నుంచి ఉద్యోగ సంఘాల నేతలకు పోలీసులు నోటీసులు ఇస్తున్నారు. చలో విజయవాడకు అనుమతి లేదని నోటీసులో పేర్కొన్నారు. 


విజయవాడకు ఎవరు వెళ్లవద్దని ఇప్పటికే మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. విజయవాడలో ఏపీ ఎన్జీవో నేత విద్యాసాగర్‌కు రాత్రి నోటీసులు అందజేశారు.


 ఉపాధ్యాయుల కదలికలపై కూడా వాలంటీర్ల ద్వారా నిఘా ఉంచినట్లు తెలుస్తోంది. ఈరోజు సాయంత్రం లేదా రాత్రికి ఎన్జీవో నేతలను ముందస్తు అరెస్టులు చేసే అవకాశం ఉంది. రేపు చలో విజయవాడకు వచ్చే వారిని అడ్డుకునేందుకు నగరం నలుమూలల చెక్ పోస్టులు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.



 చలో విజయవాడకు అనుమతి లేదని  నగర పోలీస్ కమిషనర్ క్రాంతి రానా టాటా ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ర్యాలీ నిర్వహించాలనుకున్నబీఆర్‌టీఎస్ రోడ్డులో పూర్తి స్థాయి నిఘా ఏర్పాటు చేశారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "AP: ఉద్యోగ సంఘాల నేతలపై పోలీసుల నిఘా"

Post a Comment