జీతాలు తగ్గించి చర్చల పేరిట తమపై నెపం బొప్పరాజు
గుంటూరు: అనేకసార్లు తమ సమస్యలను రాష్ట్ర ప్రభుత్వానికి
మొరపెట్టుకున్నా వినిపించుకోనందునే సమ్మె బాట పట్టామని
పీఆర్సీ సాధన సమితి నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు
తెలిపారు. చర్చలకు పిలుస్తున్నా ఉద్యోగులు ముందుకు
రావడం లేదంటూ ప్రభుత్వం పేర్కొనడం సరికాదని చెప్పారు.
గుంటూరులో ఉద్యోగుల రిలే నిరాహార దీక్షా శిబిరాన్ని ఆయన
సందర్శించారు. ఈ సందర్భంగా బొప్పరాజు మాట్లాడుతూ
జీతాలు తగ్గించి చర్చల పేరిట తమపై నెపం నెట్టాద్దన్నారు.
కొత్త జీవోలను రద్దు చేసేదాకా చర్చల ప్రసక్తే లేదని..
న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం పోరాటం
కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు
0 Response to "జీతాలు తగ్గించి చర్చల పేరిట తమపై నెపం బొప్పరాజు"
Post a Comment