కొత్త జిల్లాలకు తొలగిన అడ్డంకి

కొత్త జిల్లాల ఏర్పాటుకు ఉన్న అడ్డంకి తొలగిపోయింది. ఈ ఏడాది జూన్‌లోపు జిల్లాల భౌగోళిక సరిహద్దులు మార్చుకునేందుకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ పరిధిలోని సెన్సస్‌ డైరెక్టర్‌ రజత్‌కుమార్‌ తాజాగా రాష్ట్రాలకు లేఖరాశారు. ‘‘జన గణన నేపథ్యంలో భౌగోళిక సరిహద్దులను మార్చకూడదన్న ఉత్తర్వుల అమలును పలు దఫాలుగా పొడిగిస్తూ వచ్చాం. చివరగా గత డిసెంబరు 31 వరకు పొడిగించాం. అయితే, ఇప్పటికీ కరోనా విజృంభిస్తోంది. 




మరోవైపు వ్యాక్సినేషన్‌ ప్రక్రియ చురుగ్గా సాగుతోంది. ఈ నేపథ్యంలో గత జూన్‌ వరకు జనాభాగణన చేపట్టే వీలుకనిపించడం లేదు. తిరిగి ఎప్పుడు చేపటాలన్న కాలపరిమితిపై ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. అందువల్ల... జూన్‌లోగా రాష్ట్రాలు పరిపాలనా విభాగాలు, ప్రాంతాల భౌగోళిక విభజన చేసి ఉంటే ఆ వివరాలను వెంటనే తెలియజేయాలి’’ అని ఆ లేఖలో పేర్కొన్నారు. వెరసి... కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియకు ఉన్న ఫ్రీజింగ్‌ ఉత్తర్వుల అడ్డంకి తొలగిపోయినట్లయింది

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "కొత్త జిల్లాలకు తొలగిన అడ్డంకి"

Post a Comment