దేశమంతటా ‘అమ్మఒడి’ రాజ్యసభలో విజయసాయి ప్రైవేటు బిల్లు

న్యూఢిల్లీ, డిసెంబరు 3(ఆంధ్రజ్యోతి): ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న ‘అమ్మఒడి‘ పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేసేందుకు వీలుగా బాలల ఉచిత నిర్భంధ విద్యా హక్కు(సవరణ)-2020 పేరుతో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి శుక్రవారం రాజ్యసభలో ప్రైవేట్‌ మెంబరు బిల్లు ప్రవేశపెట్టారు. దీంతోపాటు పట్టభద్రులందరికీ నిరుద్యోగ భృతి పొందే హక్కును కల్పించేలా రాజ్యాంగ సవరణ బిల్లు, ప్రార్థనా మందిరాలపై దాడిచేసే నిందితులకు విధించే గరిష్ఠ జైలు శిక్షను రెండేళ్ల నుంచి 20ఏళ్లకు పెంచేలా ఐపీసీ(సవరణ)-2021 పేరుతో బిల్లు ప్రవేశపెట్టారు.  కాగా, ‘కార్పొరేట్‌ కంపెనీలలో ఖర్చుచేయకుండా మిగిలిపోయిన నిధులను కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ (సీఎ్‌సఆర్‌) కింద పీఎం కేర్స్‌కే ఎందుకివ్వాలి? సీఎం కేర్స్‌కు ఎందుకివ్వకూడదు?’ అని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి  కేంద్రాన్ని నిలదీశారు. ఆ నిధులను ఆయా కంపెనీల ఉద్యోగులు, కార్మికుల సంక్షేమానికి కూడా వినియోగించేలా చట్టంలో నిబంధనలను సవరించాలని కోరారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "దేశమంతటా ‘అమ్మఒడి’ రాజ్యసభలో విజయసాయి ప్రైవేటు బిల్లు"

Post a Comment