విద్యార్థుల హాజరు 75 శాతం ఉంటేనే జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన
*♓‘హాజరు 75 శాతం ఉంటేనే దీవెనకు అర్హత’..*
*గుంటూరు: రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులను అనుసరించి విద్యార్థుల హాజరు 75 శాతం ఉంటేనే జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన పొందేందుకు అర్హత సాధిస్తారని జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకుడు డి.మధుసూదనరావు ఒక ప్రకటనలో తెలిపారు. 2021-22 విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి నవంబరు 30 వరకు జ్ఞానభూమి పోర్టల్లో విద్యార్థుల హాజరు నమోదు చేయాలని, లేకపోతే అనర్హులవుతాని పేర్కొన్నారు. ఇకపై నెల పూర్తయిన వారం లోపు జ్ఞానభూమి పోర్టల్లో వివరాలు నమోదు చేయాలని స్పష్టం చేశారు. నమోదు చేయకపోతే ఆ విద్యార్థి చెల్లించాల్సిన ఫీజు మాఫీ చేయడం ఆయా కళాశాలల బాధ్యత అని తెలిపారు.*
0 Response to "విద్యార్థుల హాజరు 75 శాతం ఉంటేనే జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన"
Post a Comment