థర్డ్‌వేవ్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధం కావాలి: సీఎస్‌

అమరావతి, నవంబరు 18(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కొవిడ్‌ థర్డ్‌వేవ్‌ వస్తే దాన్ని దీటుగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ వైద్య ఆరోగ్యశాఖను ఆదేశించారు. 



గురువారం సచివాలయంలో ఆయన అధ్యక్షతన కొవిడ్‌-19 వ్యాక్సినేషన్‌పై స్టేట్‌ స్టీరింగ్‌ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సీఎస్‌ మాట్లాడుతూ.. 


గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, కరోనా థర్డ్‌వేవ్‌ను ప్రణాళికాబద్ధంగా ఎదుర్కొనేందుకు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. వైద్య సిబ్బంది ఇంటింటి సర్వే తీరుపైనా ఆరాతీశారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "థర్డ్‌వేవ్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధం కావాలి: సీఎస్‌"

Post a Comment